Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
NTR30: హీరోయిన్ విషయంలో మరోసారి నిర్ణయం మార్చుకుంటున్న దర్శకుడు.. మళ్ళీ ఆమెనే?
జూనియర్ ఎన్టీఆర్ RRR అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ హీరోయిన్ విషయంలో లో మనసు మార్చుకున్నట్లు టాక్ వస్తోంది. కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు.
ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేసి నిర్మతల చేతుల్లో పెట్టేయాలని అనుకుంటున్న కొరటాల ఆ తరువాత వెంటనే తారక్ సినిమాతో బిజీ కానున్నాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ విషయంలో ఇదివరకే ఒక నిర్ణయం తీసుకోగా ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కియారా అద్వానీని అనుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మళ్ళీ పూజా హెగ్డే వైపు యూ టర్న్ తీసుకున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం బుట్టబొమ్మ ఏ రేంజ్ లో ఆఫర్స్ అందుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా , బాలీవుడ్ అంటూ అగ్ర హీరోలతో జత కడుతోంది. ఇక ఎన్టీఆర్ 30 కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది కాబట్టి ఆ సినిమాలో పూజా హెగ్డేను ఫైనల్ చేసే అవకాశం ఉందట. ఇప్పటికే కొరటాల శివకు ఆమెతో ఆచార్య సినిమాలో కలిసి వర్క్ చేసిన అనుభవం ఉంది. ఆ పరిచయం వలన కూడా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఉండవచ్చని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.