Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ‘బ్రా’ వేస్తే డబ్బుల వర్షమే... వెనక, ముందు చూపించిన హీరోయిన్, ఫోటోస్ వైరల్!
'లోఫర్' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీకి టాలీవుడ్ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదు. బాలీవుడ్లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్లో నెట్టుకొస్తోంది. తన సినిమా అవకాశాలు, కెరీర్ ఎలా ఉన్నా ఓ విషయంలో మాత్రం దిశా పటానీ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇన్స్టాగ్రామ్లో భారీగా ఫాలోవర్స్ కలిగిన దిశా ... కాల్విన్ క్లెయిన్ అనే ఇంటర్నేషనల్ లింగరీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలు సందర్బాల్లో ఈ బ్రాండ్ లింగరీ ధరించి శృతిమించిన గ్లామర్ షో చేసి వార్తల్లో వ్యక్తిగా మారింది, కొన్ని సార్లు విమర్శల పాలైంది.
వెనక, ముందు చూపిస్తూ మరోసారి
తాజాగా మరోసారి దిశా పటానీ కాల్విన్ క్లెయిన్ స్పోర్ట్స్ బ్రా ధరించిన ఫోటోలు షేర్ చేశారు. ఈ బ్రా ధరిస్తే... వెనక నుంచి చూసినా, ముందు నుంచి చూసి సూపర్ హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తారు అనే ఒక మెసేజ్ పాస్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్ దాదాపు 2 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.
ఈ ‘బ్రా' వేస్తే డబ్బుల వర్షమే...
కాల్విన్ క్లెయిన్ బ్రా ధరించిన ఫోటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే... దిశా పటానీకి డబ్బుల వర్షం కురుస్తుందట. ఈ పోస్టుకు వచ్చే రెస్పాన్స్ బట్టి ఆమెకు భారీగా మొత్తం చెల్లించేలా సదరు కంపెనీ వారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ప్రమోషన్స్ చేయడం ద్వారా మంచి ఆదాయం వస్తుండటంతో.... సినీ తారలు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మీ కలలో మగాడిని నేనే.. సెక్స్ మార్పిడి ఊహించలేదంటున్న అదా శర్మ
విమర్శలను డోంట్ కేర్ అంటున్న దిశా పటానీ
ఇలాంటి ఫోటోలు షేర్ చేసినపుడు దిశా పటానీకి సాంప్రదాయ వాదుల నుంచి విమర్శలు తప్పడం లేదు. అయితే వాటిని డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతోంది ఈ ముంబై బ్యూటీ. ఇది తన వృతిలో భాగమే అని, మోడలింగ్ రంగంలో ఇవన్నీ సర్వసాధారణమే అని చెబుతోంది.
వీటి ఎఫెక్టుతో అవకాశాలూ పెరిగాయి
కాల్విన్ క్లెయిన్ లింగరీ బ్రాండ్ ప్రమోషన్స్ ప్రారంభించిన తర్వాత దిశా పటానీకి గ్లామర్ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ఎఫెక్టుతో ఆమెకు అవకాశాలు కూడా పెరిగాయట. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘భారత్' చిత్రంలో నటిస్తోంది.