Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొన్న వివాదాస్పద ఫోటోతో బద్నామైంది... మళ్లీ రెచ్చిపోయిన లోఫర్ హీరోయిన్
Recommended Video
సోషల్ మీడియా మాధ్యమాలు కేవలం అభిమానుల ఫాలోయింగ్ పెంచుకోవడానికి మాత్రమే కాదు.... డబ్బు సంపాదించడానికి కూడా వాడేస్తున్నారు కొందరు సినీ తారలు. ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే.
బ్రా వేసుకుని దీపావళి సెలబ్రేషన్స్.. హీరోయిన్ మీద విమర్శలు!
సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సినీ తారలను ఆయా కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పలవురు హీరోలు హీరోయిన్లతో ఇలాంటి వినూత్న ప్రచారాలు చేయిస్తున్నాయి.
‘బ్రా' చూపించి బదనాం
తెలుగులో ‘లోఫర్' సినిమాలో నటించిన దిశా పటానీ... ఇటీవల దీపావళి సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫోటో ఒకటి పోస్టు చేసింది. అంతా బాగానే ఉంది కానీ... పైన కేవలం ‘బ్రా' మాత్రమే వేసుకుంది. పవిత్రమైన పండగపూట ఈ సెక్సీ వేశాలేంటి, మన సాంప్రదాయాన్ని గౌరవించు అంటూ కొందరు విమర్శించారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... ఈ ఫోటో ద్వారా ఆమె కాల్విన్ క్లెయిన్ అనే లింగరీ బ్రాండ్ ‘బ్రా' ప్రమోట్ చేసింది.
మరోసారి రెచ్చిపోయింది
తాజాగా దిశా పటానీ.... మరో అడుగు ముందుకేసి కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ బికినీ ధరించి హాట్ ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటోలో దిశా పటానీ శృంగార దేవతలా దర్శనమివ్వడం అభిమానులకు తెగ నచ్చేసింది. కొన్ని గంటల్లోనే 15 లక్షల మంది లైక్ చేశారు.
కోటిన్నర ఫాలోవర్స్
దిశా పటానీకి ఇన్స్టాగ్రామ్లో దాదాపు కోటిన్నర మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ బ్రాండ్ ప్రమోట్ చేసినా గంటల వ్యవధిలో కోట్లాది మందికి రీచ్ అవుతుంది. అందుకే కార్పొరేట్ కంపెనీలు భారీగా డబ్బు చెల్లించి ఇలాంటి అందమైన హీరోయిన్లతో తమ సెక్సీ లింగరీ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తున్నారు.
లక్షల్లో చెల్లింపులు
దిశా పటానీకి భారీ ఫాలోయింగ్ ఉన్నందున ఒక్కో పోస్టుకు రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చెల్లిస్తారని తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో అదనపు ఆదాయం వస్తుంటే ఎవరు మాత్రం వదులుకుంటారు.... ఇక విమర్శలంటారా? అలా విమర్శించే వారు ఉన్నపుడే సినిమా తారలకు కావాల్సినంత పబ్లిసిటీ దక్కుతుంది.
దిశా పటానీ
దిశా పటానీ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె అలి అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారత్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె రాధా సర్కస్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరో. 2019 ఈద్కు ఈ మూవీ విడుదల కానుంది.