twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. భారీ చిత్రం ఆగిపోయినట్లేనా!

    |

    తమిళ సినీ వర్గాల్లో సంఘమిత్ర చిత్రం అత్యంత ఆసక్తి రేపింది. జానపథ కథతో ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని భావించారు. మొదటగా ఈ చిత్రాన్ని శృతి హాసన్ ని హీరోయిన్ అనుకున్నారు. శృతి హ్యాండ్ ఇవ్వడంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయం అని అంతా భావిస్తున్న తరుణంలో భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

    ఇంత వరకు ప్రీ ప్రొడక్షన్ పనులే మొదలు కాకపోవడం దీనికి కారణం. దిశాపటాని తాజా వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరేలా చేస్తున్నాయి. తాజగా ఓ ఇంటర్వ్యూ లో దిశా పటాని మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించింది. సౌత్ లో ఓ భారీ చిత్రానికి సైన్ చేశా. కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అని సంఘమిత్ర చిత్రాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేసింది.

    Disha patani shocking comments on Sangamithra movie

    శృతి హాసన్ ఈ చిత్రం కోసం కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది కూడా. కానీ అనుకోని కారణాల వలన ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఆ తరువాత దిశాని ఎంపిక చేశారు. భారీ పోరాట సన్నివేశాలు, గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించారు.

    English summary
    Disha patani shocking comments on Sangamithra movie. 300 cr budget for this film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X