Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. భారీ చిత్రం ఆగిపోయినట్లేనా!
తమిళ సినీ వర్గాల్లో సంఘమిత్ర చిత్రం అత్యంత ఆసక్తి రేపింది. జానపథ కథతో ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని భావించారు. మొదటగా ఈ చిత్రాన్ని శృతి హాసన్ ని హీరోయిన్ అనుకున్నారు. శృతి హ్యాండ్ ఇవ్వడంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయం అని అంతా భావిస్తున్న తరుణంలో భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇంత వరకు ప్రీ ప్రొడక్షన్ పనులే మొదలు కాకపోవడం దీనికి కారణం. దిశాపటాని తాజా వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరేలా చేస్తున్నాయి. తాజగా ఓ ఇంటర్వ్యూ లో దిశా పటాని మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించింది. సౌత్ లో ఓ భారీ చిత్రానికి సైన్ చేశా. కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అని సంఘమిత్ర చిత్రాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేసింది.
శృతి హాసన్ ఈ చిత్రం కోసం కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది కూడా. కానీ అనుకోని కారణాల వలన ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఆ తరువాత దిశాని ఎంపిక చేశారు. భారీ పోరాట సన్నివేశాలు, గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించారు.