Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిపై ఛార్జిషీట్.. వందల కోట్ల కుంభకోణంలో ఈడీ కొరడా
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ విచారణ ఈడీ వేగవంతం చేసింది. సుకేష్ చంద్రశేఖర్తో సంబంధాలు ఉన్న సినీ తారలపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిపై కేసు తోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన అధికారులు వారిద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరికి సుకేష్ చంద్రశేఖర్ భారీగా, విలువైన బహుమతులు ఇచ్చారనే విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించడంతో ఈ కేసు ఉచ్చు జాక్వలైన్, నోరా ఫతేహికి చుట్టుకొన్నది. అక్టోబర్లో జాక్వలైన్, నోరా ఫతేహిని విచారించిన సంగతి తెలిసిందే.
ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం.. దర్యాప్తులో భాగంగా చంద్రశేఖర్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. నోరా ఫతేహికి విలాసవంతమైన కారును బహుకరించాడు. అలాగే జాక్వలైన్కు కూడా కోట్లాది రూపాయల విలువైన గిఫ్టులను ఇచ్చారు. జాక్వలైన్తో సంబంధాలు ఉన్నాయనే విషయానికి వారిద్దరి ముద్దులు పెట్టుకొంటూ దిగిన ఫోటోనే సాక్ష్యం అని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉండగా, తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ జైలులో అధికారులకు భారీగా లంచం ఇచ్చి బెయిల్ తీసుకొన్నారు. కోట్లాది రూపాయలు ఇచ్చి జైలులో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. జైలు నుంచే 200 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు వచ్చాయి.
సుకేష్ చంద్రశేఖర్ విషయానికి వస్తే.. రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్ నుంచి 200 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. వారిని బెదిరించి భారీగా డబ్బు రాబట్టుకొన్నాడనే అభియోగాలపై కేసు నమోదైంది. ఆ సమయంలో చెన్నై సముద్ర తీరంలో ఉన్న ఆయన నివాసంపై మెరుపు దాడులు నిర్వహించి రూ.85 లక్షల నగదు, భారీగా విలాసవంతమైన వస్తువులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిలో డజనుకుపైగా లగ్జరీ కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.