Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రేజీ స్క్రిప్ట్ విన్నాను.. హెబ్బా పటేల్ పోస్ట్ వైరల్
ప్రస్తుతం హెబ్బా పటేల్ కొత్త కథలకు మాత్రమే ఓకే చెబుతోంది. మొదటి నుంచి కూడా హెబ్బా పటేల్ ఎంచుకునే స్క్రిప్ట్లో కొత్తదనం ఉండేలానే చూసుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలను హెబ్బా పటేల్ ఎంచుకుంటుంది. అయితే ప్రస్తుతం హెబ్బా ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో పల్లెటూరి పాత్రలో హెబ్బా పటేల్ కనిపించబోతోంది.
అలా పల్లెటూరి భామగా హెబ్బా పటేల్ పోస్టర్లు, లుక్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక చివరగా ఓరేయ్ బుజ్జిగా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలోనూ హెబ్బా పటేల్ కనిపించింది. మాస్ సాంగ్కు రామ్తో కలిసి స్టెప్పులు వేసింది. ఆ పాట, అందులో వేసిన స్టెప్పులు హెబ్బా పటేల్ను మరింత దగ్గర చేశాయి.
అయితే తాజాగా హెబ్బా పటేల్ ఓ క్రేజీ స్క్రిప్ట్ను చదివిందట. ఈ మేరకు కాన్సెప్ట్ పోస్టర్ను పోస్ట్ చేస్తూ హెబ్బా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నట్టు కనిపిస్తోంది. తెలిసిన వాళ్లు అనే డిఫరెంట్ టైటిల్తో రాబోతోంది. సిరంజ్ సినిమా నిర్మిస్తోండగా.. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారని చెప్పుకొచ్చింది.