‘అతడితో శృంగారానికి ముందు.. అలా రిహార్సల్ చేశాం..’
బాలీవుడ్ షో మ్యాన్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతున్నది. ఈ సినిమాలో స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ లాంటి హీరోయిన్ల గ్లామర్, నటన ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అయితే ఈ వెబ్ సిరీస్లో సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా, శేఖర్ సుమన్ మధ్య ఉన్న శృంగార సన్నివేశాలపై భారీ చర్చ, వివాదం జరుగుతున్నది. ఈ సన్నివేశంపై మనీషా కోయిరాలా స్పందిస్తూ..
హీరామండి సిరీస్లో ఆఫర్ గురించి చెబుతూ.. నేను నేపాల్లో ఉన్నాను.సంజయ్ కాల్ చేసి మంచి స్క్రిప్టు ఉంది. ఒకసారి చదువు. మీకు నచ్చితే ఒకే చెప్పండి. మంచి పాత్రను మీరు చేస్తే బాగుంటుంది అని అన్నారు. అయితే స్క్రిప్టు చదివిన తర్వాత నాకు మంచి పాత్రను చేసే అవకాశ వచ్చిందని భావించాను అని మనీషా చెప్పారు.

శేఖర్ సుమన్తో శృంగార సన్నివేశాన్ని ముందే నాకు చెప్పారు. సంజయ్ తన కథలో ఎవరూ ఊహించని ఎలిమెంట్ను జొప్పిస్తారు. ఆ విషయాన్ని ముందే నాకు వివరించారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలాంటి సీన్లు చేయడం సర్వసాధారణం. నటిగా ఆ సీన్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కూడా నాకు హ్యాపీని ఇచ్చింది అని మనీషా కోయిరాల తెలిపారు.

సంజయ్ ఎలాంటి సీన్ రాసినా దాని గురించి ముందే అన్ని రకాలుగా ఆలోచిస్తారు. శేఖర్తో సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు ఫర్ఫెక్షన్ కోసం రిహార్సల్ చేయిస్తాడు. ఆ సీన్ షూట్ చేయించే ముందు కూడా మాతో రిహార్సల్ చేయించారు అని చెప్పారు. అయితే కంటెంట్ను తెర మీదకు తీసుకెళ్లడంలో ఆయన ఫర్ఫెక్షన్ నాకు నచ్చుతుంది అన్నారు.

సంజయ్ లీలా భన్సాలీ, మనీషా కోయరాలా కాంబినేషన్ విషయానికి వస్తే.. ఖామోషీ సినిమా ద్వారా మొదలుపెట్టారు. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన 1942 ఏ లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత 24 ఏళ్లకు హీరామండి ఈ ఇద్దరిని కలిపింది. మనీషా కోయిరాల పాత్రకు మంచి స్పందన లభిస్తున్నది.


Click it and Unblock the Notifications











