Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ .. భలే హింట్ ఇచ్చిందిగా ?
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఇక గతంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో అతడు సినిమా సూపర్ హిట్ గా నిలవగా ఖలేజా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కానున్న మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ సినిమాలో ఇద్దరు భామలు కాగా అందులో ఇప్పటికే పూజా ను అనౌన్స్ చేశారు.
ఇప్పుడు మరో హీరోయిన్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. త్రివిక్రమ్ అన్ని సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్స్ ఉంటారు, వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కూడా ఇద్దరు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో నభా నటేష్ కూడా నటిస్తోంది అని ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం అనిపించే విధంగా ఆమె హింట్ ఇచ్చింది. నితిన్ మ్యాస్ట్రో సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఈ సందర్భంగా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లేంటి? అని ప్రశ్నించగా భవిష్యత్తు ప్రాజెక్ట్ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఐ యామ్ సారీ, నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అలా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందన్న ఆమె మాస్ట్రోలోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నానని అంది, అయితే మహేష్ సినిమాలో నటిస్తున్నారా? లేదా అని ప్రశ్నించగా అది తాను చెప్పలేనని, అధికారికంగా వాళ్ళే చెప్పాలని అన్నారు. ఇక బాలీవుడ్ లో విడుదలై ఘన విజయం అందుకున్న సినిమా అంధాధూన్ ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో తమన్నా, నభా నటేషా కీలక పాత్రధారులుగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 17న నేరుగా హాట్ స్టార్ లో విడుదల అవుతోంది. దీంతో సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.