Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అవును’ హీరోయిన్కు బెదిరింపులు.. పూర్ణను ఖతం చేస్తామని బ్లాక్మెయిల్
తెలుగు, తమిళ, మలయాళ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసింకు ఎదురైన వేధింపులు, బ్లాక్ మెయిల్ వ్యవహారం మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. కొందరు అకతాయిలు ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు లాగేందుకు ప్రయత్నించడంతో కుటుంబం అప్రమత్తమైంది. వెంటనే ఫిర్యాదు చేసి అకతాయిలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. షామ్నా ఖాసిం కెరీర్ గురించి, ఆమెకు ఎదురైన వ్యవహారంలో ఏం జరిగిందని తెలుసుకొందాం..
తెలుగులో హీరోయిన్గా
తెలుగులో శ్రీ మహాలక్ష్మి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును, లడ్డుబాబు, అవును 2, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, సువర్ణ సుందరి చిత్రాల్లో నటించారు. తాజాగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న తలైవి చిత్రంలో శశికళ పాత్రలో కనిపిస్తున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు.
ఢీ తెలుగు షోలో న్యాయమూర్తిగా
కేవలం సినిమా రంగంలోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా మంచి పాపులారిటీని సాధించారు. డాన్సర్గా తన కెరీర్ మొదలుపెట్టిన పూర్ణ సూపర్ డ్యాన్సర్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఢీ జోడి సీజన్ 11వ సీజన్, అలాగే ఢీ ఛాంపియన్స్ 12వ సీజన్లో న్యాయమూర్తిగా వ్యవహరించారు. టెలివిజన్లో పలు షోలో కనిపించారు. అంతే తమిళంలో కన్నమూచి అనే వెబ్ సిరీస్లో నటించారు.
కొద్ది రోజులుగా వేధింపులు
హీరోయిన్ పూర్ణకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులనుంచి బెదిరింపులు వస్తున్నాయి. మాకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే కెరీర్ను నాశనం చేస్తామని బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారు. ఇలా వేధింపుల కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు సంయమనం పాటించారు. అకతాయిల వేధింపులు తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
తల్లి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
తన కూతురు, యాక్టర్ పూర్ణను కొందరు వేధిస్తున్నారు. ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సొమ్ము ఇవ్వకపోతే అంతు చూస్తామని బెదిరించారు అని కేరళలోని మరదు పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసుల అకతాయిల ఫోన్లను టాప్ చేసి వారిని అరెస్ట్ చేశారు.
Recommended Video
బ్లాక్ మెయిల్ వెనుక ఎవరైనా అనే కోణంలో
నటి పూర్ణకు ఎదురైన వేధింపుల కేసులో అందిన ఫిర్యాదు ప్రకారం వెంటనే స్పందించిన నలుగురిని అరెస్ట్ చేశాం. వారిని వెంటనే జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాం. వారి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారిస్తున్నాం. అరెస్ట్ చేసిన వారిని శరత్, అశ్రఫ్, రఫీక్, రమేష్గా గుర్తించాం అని మరదు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.