Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఏడున్నర గంటలపాటు రకుల్ ప్రీత్ సింగ్ను అలా.. ఈడీ విచారణలో.. !
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ రోజురోజుకు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వారికి ఇచ్చిన తేదీ ప్రకారం గంటల తరబడి విచారణకు హాజరవుతున్నారు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఈ కేసు తెరపైకి రావడం అందరిని కాస్త కన్ఫ్యూజన్కు గురి చేసింది. 2017లోనే కేసు మొత్తం క్లోజ్ అయినట్లుగా టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత మళ్ళీ కేసును పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. డ్రగ్స్ కొనుగోలు విషయంలో సెలబ్రెటీల బ్యాంక్ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ఏడాదిలో ఎవరెవరికి ఎందుకు డబ్బులు పంపారు అనే విషయాలపై గట్టిగానే ఆరా తీస్తున్నారు. ఇక ఈ రోజు ఈడీ విచారణలో పాల్గొన్న బాలీవుడ్, దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొత్తానికి ఏడు గంటల సుదీర్ఘమైన విచారణ అనంతరం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
మర్చిపోతున్న సమయంలో..
టాలీవుడ్ సినిమాలో ఇండస్ట్రీలో గత ఇదేళ్లుగా డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందని అనేక రకాల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు విచారణలోనే అనుమానాలు వచ్చిన స్టార్స్ అందరికి టెస్టులు కూడా నిర్వహించారు. గోళ్ళు, జుట్టు వంటి వాటిని కూడా సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం కూడా పంపారు. అనంతరం 2017లో కేసు గురించి అందరూ మర్చిపోతున్న సమయంలో హఠాత్తుగా ఈడీ రంగంలోకి దిగి బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది.
ముగిసిన ఛార్మి, పూరి విచారణ
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదివరకే ఈడీ అధికారులు కొంతమంది ప్రముఖ సెలబ్రెటీలకు అనుకున్న సమయంలో విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేయడమే కాకుండా హాజరుకావాల్సిన డేట్స్ ను కూడా ఇచ్చేశారు. గత రెండు రోజులుగా ఒక్కొక్కరుగా ఇన్వెస్టిగేషన్ కు సహకరించాడనికి ముందుకు వస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కౌర్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ముందుగానే విచారణకు వచ్చిన రకుల్
పూరి జగన్నాథ్, ఛార్మి గంటల తరబడి విచారణలో పాల్గొన్న అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా విచారణకు సిద్దామయ్యింది. అయితే ఆమె సెప్టెంబర్ 6వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు అందించగా రకుల్ మాత్రం మూడు రోజుకు ముందుగానే విచారణలో పాల్గొంటానని చెప్పింది. ఆ తేదీ రోజు తనకు కురకపోవచ్చని అందుకే ముందుగానే వస్తానని శుక్రవారం ఆమె ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చారు.
Recommended Video
ఏడు గంటల పాటు విచారణ
ఇక ఈడీ విచారణలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ 7గంటల పాటు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిందట. అంతే కాకుండా ఆమె బ్యాంక్ ఎకౌంట్ డేటియిల్స్ కూడా చాలానే ఇచ్చిందట. ఈడీ అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేసిన తరువాత ఆమెను సాయంత్రం విడిచిపెట్టారు. ఇక విచారణ అనంతరం సైలెంట్ గా బయటకు వచ్చిన రకుల్ తన కారులో ఇంటికి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం రకుల్ పలు బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేస్తోంది.