Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
నేను బాగానే ఉన్నా, ఆ పుకార్లు నమ్మవద్దు: అనుష్క శెట్టి
హీరోయిన్ అనుష్క మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీలో అతిథి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆమె 'సైరా' షూటింగులో గాయపడ్డట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాలుకు ఫ్యాక్చర్ అయిందని, ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా చికిత్స తీసుకుందని ఆ వార్తల సారాంశం.
జాతీయ మీడియాకు చెందిన వెబ్ సైట్లలో సైతం అనుష్క గాయపడ్డట్లు ప్రచారం జరుగడంతో.... ఆమె స్పందించారు. 'నేను ధృఢంగా, ఆరోగ్యంగా ఉన్నాను. సీటెల్లో జరుగుతున్న షూటింగులో హ్యాపీగా పాల్గొంటున్నాను. లవ్ యూ ఆల్' అంటూ తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.
అనుష్క ప్రస్తుతం 'సైలెన్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆమె తాజా ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సీటెల్లో జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మూవీ ద్వారా హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సినిమా కోసం అనుష్క స్లిమ్ లుక్లోకి మారింది. బరువు తగ్గం కోసమే ఆమె సంవత్సరకాలం సమయం తీసుకున్నారు. 'సైలెన్స్' చిత్రాన్ని కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో అనుష్క కళలను ఇష్టపడే వ్యక్తిగా కనిపించబోతోందట. ప్రముఖ నటుడు మాధవన్ వయొలిన్ వాద్యకారుడిగా నటిస్తున్నట్లు సమాచారం. 'బాహుబలి' ప్రాజెక్ట్ తర్వాత అనుష్క సినిమాలు చేయడం తగ్గించేశారు. ఆమె నటించిన చివరి చిత్రం 'భాగమతి' 2018 మొదట్లో విడుదలైంది. ప్రస్తుతం చేస్తున్న 'సైలెన్స్' చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.