Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఛీ ఆ సినిమాలు ఎందుకు అలా చేశానా అనిపిస్తుంది: సమంత
Recommended Video
సమంత నటిస్తున్న 'యూ టర్న్' మూవీ సెప్టెంబర్ 13న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుండి తనకు నటిని అవ్వాలనే గోల్స్ ఏమీ లేవని, అనుకోకుండా యాక్టర్ అయ్యానని తెలిపారు. ఇటు వైపు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నచ్చడంతో కంటిన్యూ అయ్యానని తెలిపారు. సినిమాల్లోకి రాక ముందు ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదని, సినిమాల్లోకి వచ్చిన తర్వాతే అన్ని విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
ఆయన వల్లే నా కెరీర్కు గట్టి పునాది పడింది
అనుకోకుండా యాక్టింగ్లోకి వచ్చాను. మొదటి సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్ కావడం నాకు పెద్ద బ్లెస్సింగ్. ఆయన వల్లే నా కెరీర్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా పడిందని సమంత స్పష్టం చేశారు.
ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చాను
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలు సినిమాల్లో నటిస్తూనే తెలుసుకున్నాను. సీనియర్ యాక్టర్ల, టెక్నీషియన్లతో కలిసి పని చేయడం కూడా నాకు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం దొరికింది అని సమంత తెలిపారు.
ఇంప్రూవ్ అవుతూ వచ్చాను
ప్రతి సినిమాకు నటన పరంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. నా గత సినిమాలు చూసుకుంటూ... ఛీ ఎందుకు అలా యాక్టింగ్ చేశానా? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కొన్ని సినిమాల ఎంపిక కూడా ఇపుడు ఆలోచిస్తే తప్పు అనిపిస్తుంది అన్నారు.
సమంత ‘యూ టర్న్'
సమంత నటిస్తున్న ‘యూ టర్న్' సినిమా విషయాల్లోకి వెళితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యూ/ఎ' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13న సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకుడు. మిస్టరీ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది, భూమిక కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ హిట్ మూవీకి రీమేక్ ఇది. తెలుగుతో పాటు తమిళంలో విడుదల కాబోతోంది.