Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా భర్త అలా చేస్తే సహించను: కియారా అద్వానీ
'భరత్ అనే నేను' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా అద్వానీ ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'కబీర్ సింగ్'తో తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ ఖాతాలో వేసుకున్నారు. తెలుగు హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి' రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల వరకు వసూలు చేసింది.
కబీర్ సింగ్ ప్రేక్షకాదరణ పొంది మంచి వసూళ్లు రాబట్టినప్పకీ.. మూవీపై క్రిటిక్స్ విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. సినిమాలో యువత చెడిపోయే సీన్లు ఎక్కువగా ఉన్నాయే తప్ప మంచి విషయం ఒక్కటీ లేదంటూ మండి పడుతున్నారు. మరో వైపు ఈ సినిమాలో హీరో హీరోయిన్ను కొట్టే సన్నివేశాలపై కూడ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ప్రేమలో కొట్టుకోవడం, ప్రేమించిన వ్యక్తిని ఫిజికల్గా హింసించడం ఉంటాయా? దర్శకుడు చూపించిన విధానం బాగోలేదని పలువురు హీరోయిన్లు సైతం విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై 'కబీర్ సింగ్' హీరోయిన్ కియారా అద్వానీ సైతం స్పందించారు. ప్రేమలో తిట్టుకోవడం, కొట్టుకోవడం నాకూ ఇష్టం ఉండదు, కానీ సినిమాకు నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేశారు.
మరో ప్రశ్నకు స్పందిస్తూ... తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని కియారా తెలిపారు. ప్రేమలో ఉన్నపుడైనా, పెళ్లి తర్వాత అయినా... ప్రేమికుడు లేదా భర్త నాపై చెయ్యి వేస్తే సహించను, అలాంటి వారికి అలాంటి అవకాశం ఇవ్వను అన్నారు.
కియారా నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.... అక్షయ్ కుమార్తో కలిసి నటించిన గుడ్ న్యూస్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు లక్ష్మి బాంబ్, షేర్షా, ఇందూకి జవానీ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు.