Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆస్తులు కూడా వదులుకుంది... నయనతార గురించి సంచలన విషయాలు!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార... ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అనే తమిళ దర్శకుడితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నయనతార గత జీవితంలోకి వెళితే అనేక ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో శింబుతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ ఆ తర్వాత అతడితో విడిపోయింది. శ్రీరామరాజ్యం సినిమా తర్వాత ప్రభుదేవాను పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకున్న ఆమె చివరి నిమిషంలో అతడితో విడిపోయింది. నయనతార గురించి సినీ విశ్లేషకుడు ఇమంది రామారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆమె చిన్నతనం నుంచి అంతే...
నయనతార తండ్రి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. చిన్నతనం నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ లేడీగా ఉండేది. తల్లిదండ్రుల మాట లెక్క చేసేది కాదు. అంతా తన ఇష్ట ప్రకారమే చేసేది. క్రిస్టియన్ అయినప్పటికీ హేతువాదిగా ఉండేది. హిందూ మతంపై ఆమెకు చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేదని తెలిపారు.
‘శ్రీరామ రాజ్యం' తర్వాత సినిమాలు మానేద్దామనే అనుకుంది, కానీ...
శ్రీరామరాజ్యం సందర్భంగా తనకు ఎదురైన అనుభాలు ఆమె దర్శకుడు బాపుగారితో, బాలయ్య బాబుతో పంచుకున్నారు. అంజలి దేవి లాంటి గొప్ప నటి చేసిన సీత పాత్ర తనకు చేసే అవకాశం రావడం ఎంతో గొప్పగా ఫీలైంది. ఈ జీవితానికి ఈ తృప్తి చాలనుకుంది. ఆ మూవీ తర్వాత సినిమాల నుంచి తప్పుకోవాలనుకుంది. అందుకు కారణం అపుడు ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధం అవ్వడమే. తర్వాత కొన్ని దెబ్బలు తినడం వల్ల తన నిర్ణయం మార్చుకుందని రామారావు తెలిపారు.
ప్రభుదేవా, నయనతార పెళ్లికి ప్రభుదేవా భార్య ఒప్పుకోలేదు
నయనతారకు పెళ్లికి ముందు ప్రభుదేవా కొన్ని కండీషన్లు పెట్టాడు. ఆ కండీషన్లన్నంటికీ ఒప్పుకుంది. తన ఆస్తులు కూడా కైవశం చేసింది. నాకు నువ్వు భర్తగా ఉంటే చాలు అని కోరుకుంది. అయితే ప్రభుదేవా వైఫ్ లత.. ఆ సమయంలో చాలా పెద్ద గొడవ చేసింది. నా భర్తను ఇంకొకరి భర్తగా చేసే అవకాశం ఇవ్వను భీష్మించుకుని కూర్చుంది. చచ్చిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తానని పూనుకుంది. ఈ విషయం మద్రాసులో అందరికీ తెలిసిపోవడంతో పెద్ద గొడవైందని రామారావు తెలిపారు.
ప్రభుదేవాకు చాలా ఆస్తులు ఇచ్చింది
ప్రభుదేవాకు అప్పట్లో నయనతార చాలా ఆస్తులు ఇచ్చింది. అవి తిరిగి వచ్చాయో లేదో తెలియదు. చేసేది లేక నయనతార ప్రభుదేవాను మరిచిపోయింది. జీవితంలో అంత డిస్ట్రబ్ అయిన తర్వాత ఎవరూ కోలుకోలేరు. కానీ ఆమె దెబ్బతిన్న త్రాచుపాములా పదింతల ఉత్సాహంతో లేచి అంతకు ముందు ఉన్న హిట్ సినిమాలకంటే పెద్ద హిట్స్ కొడుతూ దూసుకెళ్లిందని తెలిపారు.
శింబు తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు
శింబు ప్లేబాయ్ లాంటివాడు. అప్పట్లో ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ‘వల్లభన్' అనే సినిమాలో ఆమెతో లిప్ లాక్ చేసి హైలెట్ అయ్యాడు. అయితే వీరి పెళ్లికి శింబు తండ్రి టి రాజేందర్ ఒప్పుకోలేదు. ఇలా లిప్ లాక్ సీన్లు చేసిందంటే ఆమెకు పెద్దలు అంటే భయం, భక్తి లేదు అందుకే నీతో అలాంటి సీన్లు ఓపెన్ గా చేసింది. నాకైతే పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాడు. అందుకే అప్పట్లో వీరి పెళ్లి జరుగలేదు అని రామారావు తెలిపారు.
అతడితో కూడా పెళ్లి చేసుకోవడం డౌటే
ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో నయనతార కలిసి ఉంటున్నారు. ఇప్పటికీ కూడా విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు. సెక్స్ అనేది ఇష్టపడి చేసుకునే తప్ప అది బాండింగ్ కాదు అని నమ్మే వ్యక్తి ఆమె. ఎవరికీ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వను అనే భావనతో ఉండేవారు. నా మనసు కోరుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అనే అభిప్రాయంలో ఉండేవారని రామారావు తెలిపారు.