Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగాస్టార్ చిరంజీవితో టబు.. ప్రయత్నాల్లో రాంచరణ్!
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సైరా చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే తొలి క్యాస్టూమ్ డ్రామా చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రంలో అమితాబ్, సుదీప్ కిచ్చ, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, నయనతార లాంటి ప్రముఖ తారలు కీలక పాత్రలను పోషిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా ఈ ప్రముఖుల జాబితాలో టబు కూడా చేరినట్టు సమాచారం.
మీడియా కథనాల ప్రకారం సైరా నర్సింహారెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం టబును చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే ఆఫర్ను ఒప్పుకొన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిసింది.
ఒకవేళ సైరాలో టబు నటిస్తే, ఓ దశాబ్దం తర్వాత తిరిగి ఆమె టాలీవుడ్లో అడుగుపెట్టినట్టు అవుతుంది. బాలకృష్ణతో కలిసి టబు చివరిసారిగా పాండురంగడు అనే తెలుగు చిత్రంలో నటించింది. గతంలో ఆమె నటించిన నిన్నె పెళ్లాడుతా చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న సైరా చిత్రానికి మెగా తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానున్నది.