జాన్వీ కపూర్ ఎద అందాల విందు: అబ్బో ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే
జాన్వీ కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూ దూసుకుపోతోంది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైన ఈ భామ.. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్, అబ్బరపరిచే యాక్టింగ్తో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. దీంతో తన మార్కెట్ను, ఫ్యాన్ ఫాలోయింగ్ను సైతం భారీగా పెంచుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జాన్వీ కపూర్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!

అలా వచ్చి.. ఇలాగ పాపులార్
శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకట్టుకుంది. మొదటి చిత్రమే అయినా అది ఏమాత్రం తెలియకుండా హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా బాలీవుడ్లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఇలా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

అలాంటి సినిమాలే చేస్తోంది
మొదటి చిత్రంలోనే అదరగొట్టిన జాన్వీ కపూర్.. సినిమాల పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి ప్రశంసలను అందుకుంది. అనంతరం 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం పరాజయం పాలైంది.

ఫుల్ బిజీ.. స్టార్ హీరోయిన్గా
బాలీవుడ్లో జాన్వీ కపూర్కు చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్ వచ్చేసింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీలో నటిస్తోంది. ఇది తమిళంలో హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్గా తెరకెక్కుతోంది. అలాగే, 'దోస్తానా 2'తో పాటు బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుంది కూడా.

టాలీవుడ్ ఎంట్రీపై పుకార్లు
టాలీవుడ్లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోయే 'జన గణ మన' మూవీలో నటిస్తుందని అన్నారు. కానీ, ఈ చిత్రానికి పూజా హెగ్డేను తీసుకున్నారు. అలాగే, ఎన్టీఆర్ సినిమాకూ ఓకే చెప్పిందని అన్నారు. కానీ, ఈ వార్తను బోనీ కపూర్ స్వయంగా ఖండించారు.

అక్కడ మాత్రం ఫుల్ బిజీనే
చాలా చిన్న వయసులోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని.. కెరీర్ పరంగా దూసుకుపోతోన్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తోంది.

అందాలను ఆరబోస్తూ ఇలా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేస్తోన్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ ట్రీట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా జాన్వీ కపూర్ తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది.

క్యాజువల్ లుక్స్లో హాట్గా
జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్కై బ్లూ కలర్ క్యాజువల్ టాప్ ధరించి ఉంది. పైగా క్లీవేజ్ అందాలు కనిపించేలా ఈ టాప్ ధరించింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ పిక్స్ అన్ని తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











