Don't Miss!
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'సాగరతీరంలో సాగరకన్య'నా.. అందాలు ఆరబోస్తూ వేడి పెంచేస్తోన్న జాన్వీ !
ఇండియన్ సినిమా చరిత్రలో తనదైన పేరును సువర్ణ అక్షరాలతో ముద్రించుకున్నారు నటి శ్రీదేవి. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా మారారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి బోనీకపూర్ ను వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె అనుకోకుండా కన్నుమూశారు. ఇక ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా 'దడక్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన తల్లి శ్రీదేవి తరహా స్టార్ ఇమేజ్ కోసం పరితపిస్తోంది. అయిన ఆమెకు సరైన సినిమా ఒక్కటి కూడా తగలడం లేదు.
సోషల్ మీడియాలో రచ్చ
అయితే జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తనదైన డ్రెస్సింగ్ స్టైల్తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటేనే ఆమె ఎంతలా రచ్చ చేస్తోందో. సీజన్ను బట్టి రకరకాల ఫొటోషూట్ లు చేసే జాన్వీ కపూర్..తాజాగా ఒక మ్యాగజైన్ కోసం సాగరకన్యలా మారిపోయింది.
మాల్దీవులలో సాగరకన్యలా
వెస్టిన్ మాల్దీవులు మిరియాంధూ రిసార్ట్లో ఆమె కెమెరాకి ఫోజులు ఇచ్చింది. భారతదేశంలో కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్కు ముందు ఈ ఫోటోషూట్ జరిగింది. మే నెల ట్రావెల్ + లీజర్ మ్యాగజైన్ కవర్ షూట్ కోసం జాన్వీ కపూర్ పోజులిచ్చారు. జాన్వీ కపూర్ ఈ ఫోటోలలో మత్స్యకన్యలా కనిపిస్తోంది. తెల్లని ఇసుక మీద ఆమె ఆకుపచ్చ డ్రెస్ వేసుకుని అలాగే మరికొన్ని ఫోటోలలో బికినీలో కనిపిస్తూ రచ్చ చేసింది.
స్పెషల్ ఇమేజ్ కోసం
ఇక జాన్వీ ఇప్పుడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆచితూచి అడుగులు వేస్తూ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె రూహి సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. రాజ్కుమార్ రావు, వరుణ్ శర్మలతో కలిసి ఈ చిత్రంలో జాన్వి కపూర్ నటించారు. గత నెల 11న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
Recommended Video
వరుస సినిమాలు లైన్ లో
అంతకుముందు ఓటీటీలో గుంజన్ సక్సేనా అనే సినిమాతో పలకరించింది. అయితే ఈ సినిమాకి కూడా పెద్దగా పేరు రాలేదు. మొత్తం అందాలన్నీ మత్స్యకన్య కన్యలా ఆరబోస్తూ ఉండడంతో ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న 'ఘోస్ట్ స్టోరీస్' సెకండ్ సీజన్ లో జాన్వీ నటిస్తోంది. ఇవి కాక 'గుడ్ లక్ జెర్రీ', కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న 'తఖ్త్', ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'దోస్తానా 2' సినిమాలు కూడా ఆమె చేస్తోంది.