Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కార్గిల్ పోరాట యోధురాలిగా శ్రీదేవి కుమార్తె!
1999లో జరిగిన కార్గిల్ వార్ లో పాక్ ని ఇండియా చిత్తు చేసింది. ఈ యుద్ధంలో ఎందరో భారత సైనికులు వీరోచితంగా పోరాడారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో వైమానిక దళానికి గుంజన్ సక్సేనా అనే మహిళా సైనికురాలు అధికారిగా పనిచేశారు. కార్గిల్ వార్ లో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యం. పాక్ ఆర్మీకి ధీటుగా ఎదుర్కొన గుంజన్ సక్సేనా ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు.
గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో గుంజన్ సక్సేనా పాత్ర జాన్వీ కపూర్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పనులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణం కావడంతో గ్లామర్ కు దూరంగా ఉండే వార్ చిత్రం అయినప్పటికీ జాన్వీ ఒకే చెప్పేసిందట.
ఈ చిత్ర దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. జాన్వీ కపూర్ ఈ ఏడాదే దఢక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ థక్త్ అనే చిత్రంలో నటిస్తోంది. శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి చిత్రంతోనే నటిగా మంచిమార్కులు కొట్టేసింది.