Janhvi Kapoor 300 కోట్లతో తెలుగులోకి... 500 కోట్లతో తమిళంలోకి.. శ్రీదేవి ముద్దుల కూతురు ఎంట్రీ
అలనాటి అందాలతార శ్రీదేవి తనయగా సిల్వర్ స్క్రీన్కు పరిచయమైంది జాన్వీ కపూర్. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రస్తుతం గట్టి ప్రయత్నమే చేస్తోంది. తక్కువ సినిమాల్లో నటించిన ఇప్పటికైతే క్రేజీ హీరోయిన్గా అనిపించుకుంటోంది. ఇప్పటివరకు బాలీవుడ్లో వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీవైపు అడుగులో వేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం 300 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ బ్యూటీకి కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. సోషల్మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్లో ఉంటుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే సెలెక్ట్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అలా ధడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ... ఆ చిత్రం విజయం సాధించడంతో వరుస ఆఫర్లను అందుకుంది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రూహీ, మిలి, బవాల్ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

అలా ఓ వైపు హిందీ చిత్రాల్లో నటిస్తూనే సౌత్ ఇండస్ట్రీ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఆమెకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించబోయే నెక్ట్స్ సినిమాలో జాన్వీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య 'కంగువ' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం తర్వాత సూర్య బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మహాభారత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య కర్ణుడి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసమే జాన్వీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే జాన్వీ ఈ చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినట్టవుతుంది. ఎలాగో హిందీలో జాన్వీ ఎన్ని చిత్రాలు చేస్తున్న స్టార్ డమ్ ఆమెకు అందని ద్రాక్షగా మారింది. కాబట్టి సౌత్లో జాన్వీ ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటే కచ్చితంగా అవకాశాలు క్యూ కడతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇకపోతే సూర్య - ఓం ప్రకాశ్ సినిమా బడ్జెట్ రూ.500కోట్లు అని సమాచారం. రెండు భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మొదటి భాగం పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల టాక్. సూర్య, జాన్వీతో పాటు ఇండియన్ సినిమాలోని ఇతర స్టార్స్ను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో ప్రాజెక్ట్ కూడా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











