Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జాహ్నవి కపూర్ డ్రెస్ చూసి అంతా షాక్... మరీ ఇలానా అంటూ కామెంట్స్!
Recommended Video
'ధడక్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ తన అందం, టాలెంటుతో బాలీవుడ్లో సూపర్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లాంటి టఫ్ కాంపిటీషన్ ఉన్న ఇండస్ట్రీలో టాప్ రేంజికి ఎదగడానికి కేవలం నటనను మాత్రమే నమ్మకుంటే సరిపోదా? ఎక్స్ ఫోజింగ్ లాంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలవడం, వివాదాలతో హైలెట్ అవ్వడం తప్పనిసరా? అంటే..... చాలా మంది అవుననే అంటున్నారు. తాజాగా జాహ్నవి కపూర్ వ్యవహారం చూస్తుంటే ఇది నిజమే అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
జాహ్నవి కపూర్ పింక్ డ్రెస్ హాట్ టాపిక్
తాజాగా జాహ్నవి కపూర్ ధరించిన పింక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో షార్ట్ కానీ, ప్యాంట్ కానీ వేసుకోకుండా కేవలం టాప్ మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. ఈ ఫోటోపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ట్రోల్స్
ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు జాహ్నవి కపూర్ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ ప్రారంభించారు. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందని, పబ్లిక్ ప్రదేశాల్లో మరీ ఇలాంటి అవతారంలో తిరగడం కాస్త అభ్యంతరకరమే అనే కామెంట్స్ చేస్తున్నారు.
జాహ్నివికి కూడా పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందా?
జాహ్నవికి కూడా మీడియా పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, కావాలని ఫోటోగ్రాఫర్ల కంట పడేలా ఇలా ఎక్స్ ఫోజింగ్ వేషాలు వేస్తోందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ దాటితే అందంగా కనిపించడం అటుంచితే అసహ్యం వేసే పరిస్థితి ఏర్పడుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
జాహ్నవి కపూర్ సినిమాలు
ధడక్ అనే సినిమా ద్వారా నటిగా తెరంగ్రేటం చేసిన జాహ్నవి కపూర్కు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ‘తక్త్' అనే భారీ బడ్జెట్ మూవీలో కీలకమైన పాత్రకు ఎంపికైంది. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ గ్యాపులో జాహ్నవి ఇతర సినిమాలు సైతం చేసే అవకాశం ఉంది.