Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
చేతిలో పేకలు, కౌగిల్లో భర్త, ఎదురుగా మందు.. ఫోటో షేర్ చేసిన కాజల్ ను ఆడుకుంటున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఏడాది పూర్తి అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాలు తగ్గడంతో ఈ భామ బ్రాండ్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది. అయితే అదేదో ఉపయోగపడే బ్రాండ్లు అనుకుంటే మీరు పొరబడినట్లే, ఒక మద్యం బ్రాండ్ కు ప్రమోషన్ చేసిన ఆమె ఆ మద్యం బాటిల్ తో, తన భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెను టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ వివరాల్లోకి వెళితే
పెళ్లి చేసుకుని
సినిమాల్లో కాస్త అవకాశాలు తగ్గాయని భావించిన కాజల్ అగర్వాల్, సైలెంట్ గా తన ప్రియుడు గౌతమ్ ని వివాహం చేసుకుంది. సరిగ్గా కరోనా సమయంలో పెళ్లి కూడా చేసుకోవడంతో పెద్దగా గ్రాండ్ గా కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితేనేమి తన భర్తకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాజల్ సందడి చేస్తూ ఉంటుంది.
దాని కంటే ఇదే బెటర్ అని
అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ చేసిన ఒక పని సోషల్ మీడియా వేదికగా ఆమె టార్గెట్ అయ్యేలా చేసింది. అసలు విషయం ఏమిటంటే భారతదేశంలో మద్యం బ్రాండ్లను టీవీ ఎడ్వర్టైజ్మెంట్ ల ద్వారా ప్రమోట్ చేయడం నేరం. అందుకే వాటిని మ్యూజిక్ సీడీలు, సోడా అన్నట్లు భ్రమ కలిగిస్తూ టీవీ యాడ్ లు చేస్తూ ఉంటారు. దాని కంటే ఒక సెలబ్రిటీల చేత సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయిస్తే దాని రీచ్ ఎక్కువగా ఉంటుందని భావించి సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి మరి ప్రమోట్ చేయిస్తున్నారు.
మొన్న రెజీనా
కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రెజీనా కూడా ఇదే విధంగా ఒక విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేయగా ఆమెను పెద్ద ఎత్తున నెటిజన్లు టార్గెట్ చేశారు. ఇప్పుడు కాజల్ కూడా అదే బాటలో పయనించడంతో కాజల్ ని కూడా భారీ స్థాయిలో ట్రోల్ చేస్తూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా కాజల్ తన భర్తతో కలిసి మందు కొడుతున్నట్టుగా, పేకాట ఆడుతున్నట్టుగా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మందు బాటిల్ తో
ఆ ఫోటోలో టీచర్స్ బ్రాండ్కు సంబంధించిన మందు బాటిల్ ఉంది. ఇక ఆ ప్రొడక్ట్కు సంబంధించిన పోస్ట్ చేసిన కాజల్ ఇప్పుడు నెటిజన్లకు టార్గెట్ గా మారింది. ఈ పండుగను టీచర్స్ స్మూత్ లిక్విడ్తో సెలెబ్రేట్ చేసుకోండి.. ఇదే పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఈ విస్కీ బ్రాండ్కు అంబాసిడర్గా మారినందుకు నాకు కిచ్లూకు ఎంతో ఆనందంగా ఉంది. బాధ్యతగా తాగండి. ఈపోస్ట్ కేవలం పాతికేళ్లు నిండిన వారికే అని కూడా ఆమె రాసుకోచ్చిందీ. అంతే కాక భర్త కౌగిల్లో ఒదిగిపోయి, పేక ముక్కలతో ఆమె కనిపిస్తోంది.
Recommended Video
దేన్నైనా ప్రమోట్ చేస్తారా?
ఆమె పాతికేళ్లు పైబడిన వారికి ఈ పోస్ట్ అని చెప్పినా సరే పాతికేళ్ళలోపు వాళ్ళు చూడడం మానేస్తారా? అదీ కాక ఈ మధ్య యూత్ సోషల్ మీడియాలో గడుపుతోంది. దీంతో కాజల్ ఏం సందేశం ఇస్తోంది అంటూ నెటిజన్లు ఆమె ని టార్గెట్ చేస్తున్నారు. పండుగ వస్తే కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పడం పోయి ఇలా తాగమని పోస్టులు పెడతారా ఇదేం ప్రమోషన్? డబ్బులు ఇస్తే దేనినైనా ప్రమోట్ చేస్తారా? అంటూ కాజల్ను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు.