twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. ముఖం చూపించలేకపోతున్నా అంటూ పోస్ట్!

    |

    కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి, దీని కారణంగా బాలీవుడ్ సహా టాలీవుడ్ ప్రముఖులు కూడా దాన్ని తప్పించుకోలేక పోయారు. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ కూడా కరోనా పాజిటివ్‌ అని తన సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది. ఈ పోస్ట్ వచ్చిన వెంటనే, అభిమానులు కాజోల్ జాగ్రత్తగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆ వివరాలు

    కరోనా దెబ్బకు సెలబ్రిటీలు.

    కరోనా దెబ్బకు సెలబ్రిటీలు.

    చాలా మంది బాలీవుడ్ సహా అనేక భాషలకు చెందిన నటులు కరోనా బారిన పడుతున్నారు మరీ ముఖ్యంగా జాన్ అబ్రహం, మృణాల్ ఠాకూర్, ఏక్తా కపూర్, నకుల్ మెహతా, నోరా ఫతేహి, కరీనా కపూర్ ఖాన్, అమృతా అరోరా, అర్జున్ కపూర్‌లతో సహా చాలా మంది నటులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు బాలీవుడ్ నటి కాజోల్ తన కుమార్తె న్యాసాతో కలిసి ఉన్న ఫోటో పంచుకుంటూ కరోనా పాజిటివ్ అని వెల్లడించింది.

    న్యాసాతో కలిసి

    న్యాసాతో కలిసి

    కాజోల్ తన కుమార్తె ఫోటో షేర్ చేసి , "నా కోవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నా ఎర్రటి ముక్కును ఎవరికీ చూపించకూడదనుకుంటున్నాను, కాబట్టి నేను సరిగ్గా చేశా. ప్రపంచంలోని మధురమైన చిరునవ్వును చూస్తూ ఉండండి మిస్ యూ న్యాసా దేవగన్." అని పేర్కొంది. ప్రస్తుతానికి న్యాసాతో కలిసి సింగపూర్‌లో ఉన్నారు కాజోల్.

    అద్భుతమైన వ్యక్తి అంటూ

    అద్భుతమైన వ్యక్తి అంటూ


    ఇక కాజోల్ చేసిన ఈ పోస్ట్‌ కారణంగా అందరూ ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో, నటి ప్రియాంక చోప్రా కాజోల్ కుమార్తె న్యాసాను అద్భుతమైన వ్యక్తి అంటూ అభివర్ణించింది. కాజోల్ తన కూతురు న్యాసాతో కలిసి సింగపూర్‌లో ఉంది. న్యాసా చదువుల కారణంగా కాజోల్ ఆమెతో పాటు అక్కడే ఉండిపోయింది. అయితే, ఈ సమయంలో కాజోల్ ముంబై నుంచి సింగపూర్‌ షటిల్ సర్వీస్ చేస్తోంది.

    2 నెలల క్రితం, కాజోల్ సోదరి తనీషాకు కూడా

    2 నెలల క్రితం, కాజోల్ సోదరి తనీషాకు కూడా

    గత కొన్ని నెలలుగా ఇప్పటివరకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. దాదాపు 2 నెలల క్రితం, కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ కూడా కరోనా పాజిటివ్‌గా మారింది. మరోవైపు, కాజోల్ భర్త అజయ్ దేవగన్ తన OTT అరంగేట్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన వెబ్ సిరీస్ 'రుద్ర' ట్రైలర్ విడుదలైంది. అభిమానులకు అది బాగా నచ్చడంతో సిరీస్ మీద ఆసక్తి పెరుగుతోంది.

    కాజోల్ 'త్రిభంగ్'లో

    కాజోల్ 'త్రిభంగ్'లో


    కాజోల్ సినిమా గురించి చెప్పాలంటే ఆమె చివరిగా 'త్రిభంగ్' చిత్రంలో కనిపించింది. అతని చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో 15 జనవరి 2021న విడుదలైంది. ఇప్పుడు ఆమె త్వరలో రేవతి యొక్క 'ది లాస్ట్ హుర్రే'లో కూడా కనిపించనుంది. ఇక న్యాసా కాజోల్ మరియు అజయ్ దేవగన్ దంపతులకు 20 ఏప్రిల్ 2003న జన్మించింది. ఆమె వయస్సు 18 సంవత్సరాలు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని గ్లియోన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కోర్స్ పూర్తి చేసి తదుపరి చదువుల కోసం సింగపూర్ వెళ్ళింది.

    English summary
    Kajol announces she has tested positive for Covid 19 by sharing a pic of her daughter Nysa
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X