Don't Miss!
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బీఎంసీకి కంగన షాక్... రూ.2కోట్ల నష్టపరిహారం డిమాండ్... లీగల్ నోటీసులు జారీ
కంగనతో అంత ఈజీ కాదన్న విషయం మరోసారి ముంబై నేతలకు అర్ధమైంది. బాధాతప్త హృదయంతో ముంబై వీడిన కంగన, మనాలీకి చేరుకుంటూనే మరోసారి బాంబు విసిసింది. తన కార్యాలయాన్ని ధ్వసం చేసిన బీఎంసీకి లీగల్ నోటీసులు పంపింది.
ముంబైలోని తన కార్యాలయం పై దాడి చేసి ధ్వంసం చేసిన బీఎంసీ, తనకు రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ మేరకు లీగల్ నోటీసులు సైతం జారీ చేయించింది. నగరాన్ని విడిచి వెళ్లే ముందే ధ్వంసమైన తన భవనాన్ని పునర్ నిర్మించేందుకు తన వద్ద డబ్బులేవని స్పష్టం చేసిన కంగన, అదే కార్యాలయం నుంచి పనిచేస్తానని శపథం చేసిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై ముంబైలో ఉండగానే గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి పరిస్థితిని వివరించిన కంగన, తనకు న్యాయం దక్కుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కరోనా వల్ల ప్రస్తుతం చేతిలో పని కూడా లేనందున ఇప్పుడు కార్యాలయాన్ని రినోవేట్ చేయలేనని చేతులెత్తేసింది.
తాజాగా ఎవరైతే తన భవనాన్ని ధ్వంసం చేశారో, వారే నష్టపరిహారాన్ని సైతం చెల్లించాలని కుండబద్దలు గొట్టేసింది. కంగన నోటీసులకు బీఎంసీ ఇంకా సమాధానమివ్వాల్సి ఉంది. మరి అటువైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.