Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుప్రీమ్ కోర్టులో కంగన కేవియెట్... ఆస్థి ధ్వసం కేసులో రివెంజ్ కు సిద్ధం.
ముంబైలోని కంగన రనౌత్ కు చెందిన కార్యాలయంపై బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ దాడిని బాంబే హైకోర్టు తప్పుబట్టిన వార్త సంచలనం సృష్టిస్తుండగానే మరోవైపు ది క్వీన్ నటీమణి సైతం వేగంగా పావులు కదుపుతోంది. BMC డెమాలిషన్ కేసు విషయంలో సుప్రీమ్ కోర్టులో కేవియెట్ ధాఖలు చేసింది. బాంద్రాలోని తన కార్యలయాన్ని ధ్వంసం చేసిన కేసు విషయంలో తన ప్రమేయం లేకుండా కేసు హియరింగ్ నిర్వహించకూదని వినతి చేసుకుంది.
నవంబర్ 27న బాంద్రాలోని తన కర్యాలయ సముదాయంపై BMC ఆకస్మిక దాడి, ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ కంగన వేసిన పిటిషన్ ను సమర్ధిస్తూ బాంబే హై కోర్టు ఆమెకు కాస్త ఉపశమనం కలిగించిన సంగతి తెలిసిందే. కార్యయలం పై దాడి కుయుక్తులతో కూడిన చర్యగా బాంబే హై కోర్టు వ్యాఖ్యానించింది. ఈ చర్యను పౌరహక్కుల ఉల్లంఘన, అంటే చట్టాన్ని తప్పుదోవ పట్టించడం కిందే లెక్క అంటూ BMC వ్యవహారాన్ని దుయ్యబెట్టింది. గతంలో శివసేన పెద్దలపై మాటల తూటాలు విసిరి కంగన వారి ఆగ్రహానికి గురైన సంగతి విదితమే.
ఇక ఇటీవలే శివసేన పార్టీలో చేరిన రంగీలా బ్యూటీ ఊర్మిళా మతోండ్కర్, కంగన వ్యవహారంపైనా తనదైన శైలిలో స్పందించింది. ఆమెతో మాటల యుద్ధానికి తాను సిద్ధంగా లేనంటూ వ్యఖ్యానించింది. ఆమెకు అనవసరమైన ప్రాముఖ్యతను ఇస్తున్నారని చెప్పిన ఊర్మిళ, తాను కంగన అభిమానిని కానని, ఆమె గురించి తాను మాట్లాడాల్సిందేమీ లేదని స్పష్టం చేసింది.