Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సుప్రీమ్ కోర్టులో కంగన కేవియెట్... ఆస్థి ధ్వసం కేసులో రివెంజ్ కు సిద్ధం.
ముంబైలోని కంగన రనౌత్ కు చెందిన కార్యాలయంపై బ్రిహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ దాడిని బాంబే హైకోర్టు తప్పుబట్టిన వార్త సంచలనం సృష్టిస్తుండగానే మరోవైపు ది క్వీన్ నటీమణి సైతం వేగంగా పావులు కదుపుతోంది. BMC డెమాలిషన్ కేసు విషయంలో సుప్రీమ్ కోర్టులో కేవియెట్ ధాఖలు చేసింది. బాంద్రాలోని తన కార్యలయాన్ని ధ్వంసం చేసిన కేసు విషయంలో తన ప్రమేయం లేకుండా కేసు హియరింగ్ నిర్వహించకూదని వినతి చేసుకుంది.
నవంబర్ 27న బాంద్రాలోని తన కర్యాలయ సముదాయంపై BMC ఆకస్మిక దాడి, ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ కంగన వేసిన పిటిషన్ ను సమర్ధిస్తూ బాంబే హై కోర్టు ఆమెకు కాస్త ఉపశమనం కలిగించిన సంగతి తెలిసిందే. కార్యయలం పై దాడి కుయుక్తులతో కూడిన చర్యగా బాంబే హై కోర్టు వ్యాఖ్యానించింది. ఈ చర్యను పౌరహక్కుల ఉల్లంఘన, అంటే చట్టాన్ని తప్పుదోవ పట్టించడం కిందే లెక్క అంటూ BMC వ్యవహారాన్ని దుయ్యబెట్టింది. గతంలో శివసేన పెద్దలపై మాటల తూటాలు విసిరి కంగన వారి ఆగ్రహానికి గురైన సంగతి విదితమే.
ఇక ఇటీవలే శివసేన పార్టీలో చేరిన రంగీలా బ్యూటీ ఊర్మిళా మతోండ్కర్, కంగన వ్యవహారంపైనా తనదైన శైలిలో స్పందించింది. ఆమెతో మాటల యుద్ధానికి తాను సిద్ధంగా లేనంటూ వ్యఖ్యానించింది. ఆమెకు అనవసరమైన ప్రాముఖ్యతను ఇస్తున్నారని చెప్పిన ఊర్మిళ, తాను కంగన అభిమానిని కానని, ఆమె గురించి తాను మాట్లాడాల్సిందేమీ లేదని స్పష్టం చేసింది.