భోరుమని ఏడ్చిన కంగన రనౌత్.. అతడి తలుచుకొని కంటతడి
తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. ముఖ్యంగా మార్చి 23న జన్మదినం జరుపుకొంటున్న కంగన రనౌత్ భావోద్వేగాన్ని తట్టుకోలేక భోరుమని ఏడ్వడం ప్రతీ ఒక్కరిని కదిలించింది.
తలైవి ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం కంగన రనౌత్ తన డైరెక్టర్ ఏఎల్ విజయ్ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన టాలెంట్ను గుర్తించి, నాకు ఎంతో అండగా నిలిచిన డైరెక్టర్. తలైవి షూటింగులో నాతో ఎన్నో విషయాలు పంచుకొన్నారు అంటూ వేదికపై కంటతడి పెట్టుకొన్నారు.

నాకు నేను బబ్బర్ షేర్ని అని పిలుచుకొంటాను. నా జీవితంలో ఎన్నడూ ఏడ్చిన సందర్భాలు లేవు. ఏ విషయాన్ని అంత సులభంగా వదులకొను. నేను గతంలో ఎన్నడు ఏడ్చానో నాకే గుర్తు లేదు. కానీ తలైవి ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో కంటతడి పెట్టాను. ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఓ మంచి విషయం నన్ను కంటతడి పెట్టించింది అని కంగన ట్వీట్ చేసింది.
ఇదిలా ఉండగా, మంగళవారం (మార్చి23)న రిలీజైన తలైవి చిత్రం ట్రైలర్కు మంచి ఆదరణ లభిస్తున్నది. సమంత లాంటి సినీ తారలు ఈ ట్రైలర్, కంగనపై ప్రశంసల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











