Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భోరుమని ఏడ్చిన కంగన రనౌత్.. అతడి తలుచుకొని కంటతడి
తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. ముఖ్యంగా మార్చి 23న జన్మదినం జరుపుకొంటున్న కంగన రనౌత్ భావోద్వేగాన్ని తట్టుకోలేక భోరుమని ఏడ్వడం ప్రతీ ఒక్కరిని కదిలించింది.
తలైవి ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం కంగన రనౌత్ తన డైరెక్టర్ ఏఎల్ విజయ్ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన టాలెంట్ను గుర్తించి, నాకు ఎంతో అండగా నిలిచిన డైరెక్టర్. తలైవి షూటింగులో నాతో ఎన్నో విషయాలు పంచుకొన్నారు అంటూ వేదికపై కంటతడి పెట్టుకొన్నారు.
నాకు నేను బబ్బర్ షేర్ని అని పిలుచుకొంటాను. నా జీవితంలో ఎన్నడూ ఏడ్చిన సందర్భాలు లేవు. ఏ విషయాన్ని అంత సులభంగా వదులకొను. నేను గతంలో ఎన్నడు ఏడ్చానో నాకే గుర్తు లేదు. కానీ తలైవి ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో కంటతడి పెట్టాను. ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఓ మంచి విషయం నన్ను కంటతడి పెట్టించింది అని కంగన ట్వీట్ చేసింది.
ఇదిలా ఉండగా, మంగళవారం (మార్చి23)న రిలీజైన తలైవి చిత్రం ట్రైలర్కు మంచి ఆదరణ లభిస్తున్నది. సమంత లాంటి సినీ తారలు ఈ ట్రైలర్, కంగనపై ప్రశంసల వర్షం కురిపించారు.