Just In
- 4 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 22 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 3 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
Don't Miss!
- News
కాస్మిక్ గర్ల్: పీఎస్ఎల్వీలు కాదు.. విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం: ఒకేసారి తొమ్మిది
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లీగల్ యాక్షన్ పై తలైవి సెటైర్... మహానాయకురాలైనెట్టేనంటూ కౌంటర్
కాంట్రావర్షియల్ ట్వీట్స్ చేస్తూ కొరివితో తలగోక్కోవడం కంగనా రనౌత్ కు మహా సరదా అనడంలో సందేహమేలేదు. తాజాగా రైతుల పోరాటంపై వివాదాస్పదమైన ట్వీట్ చేసి అభాసుపాలైన కంగనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులపై అమ్మడు మరోసారి తనదైన స్టైల్ లో స్పందించింది.
ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న రైతుల నిరశన ప్రదర్శనలో కేవలం వందరూపాయిలు తీసుకుని బిల్కిస్ బానో కూడా పాలుపంచుకున్నారని ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కంగన, అది ఫేక్ అని తెలియడంతో కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. ఇక అప్పటి నుంచి తలైవిపై విమర్శల వర్షం కురుస్తోంది. పంజాబీ స్టార్ హీరో దల్జీత్ దోసాంజ్ ఆమెపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. తాజాగా ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ కూడా కంగనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వగా, ఢిల్లీ సిఖ్ గురుద్వార్ మేనేజ్మెంట్ కమిటీ కూడా లీగల్ నోటీసులు పంపింది.

ఇక ఈ వ్యవహారంపై స్పందించిన కంగన ఫిల్మ్ మాఫియా తనపై ఎన్నో కేసులను బనాయించిందని, మహారాష్ట్ర ప్రభుత్వం తనపై గంటకో కేసు వేస్తోందని, ఇప్పుడు పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరితో చేతులు కలిపిందంటూ ట్వీట్ చేసింది. చూడబోతే వీరందరూ కలసి తననో మహా నాయకురాలిని చేసే వరకూ నిద్రపోయేలా లేరని సెటైరికల్ గా ట్వీట్ చేసింది.
మరోవైపు కెరీర్ పరంగా సూపర్ బిజీగా ఉన్న కంగనా రనౌత్, ప్రస్తుతం తేజస్ సినిమా షూటింగ్ లో పాలుపంచుకుంటోంది. ఇటీవలే తలైవి షూటింగ్ పూర్తవ్వగా త్వరలోనే అది విడుదలకు సిద్ధమవుతోంది.