కరోనా వేళ దుష్టశక్తులతో జాగ్రత్త.. విపత్కర పరిస్థితుల్లో కంగన రనౌత్ పంచ సూత్రాలు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, టాప్ హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి ట్విట్టర్లో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. దేశంలో కరోనావైరస్ పరిస్థితులు విపత్కరంగా మారిన పరిస్థితుల్లో సెలెబ్రిటీలు తమకు తోచిన సహాయాన్ని పలు రూపాల్లో అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనావైరస్ మహమ్మారి గురించి కంగన రనౌత్ ట్వీట్ చేస్తూ..
మానవులంతా కరోనావైరస్ గురించి తామకు తామే ఏదో ఊహించుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకరికాళ్లను మరొకరు లాగేసుకొంటూ వారి ఆర్థిక పరిస్థితిని దిగజారేలా చేసుకొంటున్నారు. నా మాటలను కొందరు సమర్దించవచ్చు.. మరికొందరు వ్యతిరేకించడానికి ఆస్కారం ఉంది. గాయపడిన భూమండలానికి స్వాంతన చేకూరుతున్నది. వైరస్ కొంత మందిని పొట్టునబెట్టుకోవచ్చు. కానీ ఈ బాహ్య ప్రపంచానికి మేలు చేస్తున్నది అంటూ కంగన ట్వీట్ చేశారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ఐదు సూత్రాలను కంగన రనౌత్ పేర్కొన్నారు.
1. ప్రతీ ఒక్కరు ఏడాదికి ఈ భూమిపై ఎనిమిది చెట్లు నాటాలి.
2. కుందేళ్లను పెంచడం ఆపివేయాలి.
3. ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయాలి.
4. ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు.
4. నీ పక్కనే ఉంటూ నిన్ను నాశనం చేయాలనే దుష్టశక్తులను జాగ్రత్తగా గమనించండి అంటూ కంగన రనౌత్ వెల్లడిచారు.
ఇదిలా ఉండగా, కరోనావైరస్ నుంచి దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కంగన రనౌత్ పూర్తి మద్దతును తెలిపారు. కరోనావైరస్ పరిస్థితులను చక్కదిద్దడానికి తీసుకొంటున్న చర్యలను సమర్ధించారు.


Click it and Unblock the Notifications











