కరోనా బారిన కరీనా.. దూరం నుంచే చూస్తూ లవ్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్… చూసారా?
బాలీవుడ్ నటి కరీనా కపూర్ కరోనా బారినపడటం చర్చనీయాంశంగా మారింది. ఆమెకు పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు వెంటనే నటి నివాసముంటున్న భవనాన్ని సీల్ చేసి అక్కడి వారందరికీ పరీక్షలు చేశారు. అయితే అక్కడ సైఫ్ ఆచూకీ లభించక పోవడం చర్చనీయాంశం అయింది. తాజాగా ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

సహకరించడం లేదని
కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కరీనా కుటుంబం తమకు సహకరించడం లేదని బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎన్నో సార్లు అడిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ముంబయిలో లేరన్న విషయాన్ని చెప్పారని, అయితే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయం మాత్రం చెప్పట్లేదని ఆరోపించారు. అది జరిగిన గంటల వ్యవధిలోనే కరీనా ఫోటోలు షేర్ చేసింది.

ఆందోళన వ్యక్తం
బాలీవుడ్ తారలు కరీనా కపూర్, అమృతా అరోడాకు సోమవారం కరోనా పాజిటివ్గా తేలింది. వీరిద్దరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఇటీవల ముంబయిలో పలు పార్టీల్లో పాల్గొన్నారని బీఎంసీ అధికారులు ఆరోపించడమే కాక అనేక మందితో కాంటాక్టు కావడంతో మరింత మందికి కొవిడ్ వ్యాపించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

సైఫ్ అలీ ఖాన్ దూరంగా ఉంటూ
ఇక మంగళవారం ఉదయం కరీనా నివశించే అపార్ట్మెంట్కు వెళ్లిన అధికారులు అక్కడ ఉన్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో కరీనా కుటుంబం అధికారులకు సరిగా సహకరించలేదని, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ గురించి అడిగితే సమాధానం చెప్పలేదని బీఎంసీ వర్గాలు ఆరోపించాయి. పదేపదే ప్రశ్నించిన తర్వాత.. గత వారం రోజుల నుంచి సైఫ్ ముంబయిలో లేరని చెప్పినట్లు పేర్కొన్నాఋ.
ఇదంతా జరిగిన మరుసటి రోజే ఒక ఫోటో షేర్ చేసింది కరీనా కపూర్. కరీనా కపూర్ ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నారు. కరోనా బారిన పడి క్వారంటైన్లో గడుపుతున్న కరీనా కపూర్ ఆరోగ్యంపై సైఫ్ నిశీతంగా గమనిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ దూరంగా ఉంటూ తన భార్య ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటున్నాడో కరీనా ఈ ఫోటోను షేర్ చేసింది.

టెర్రస్పై సైఫ్ అలీ ఖాన్
కరీనా ఇన్స్టాలో సైఫ్ అలీ ఖాన్ తన ఇంటి ముందు టెర్రస్పై నిలబడి కాఫీ తాగుతున్న ఫోటోను షేర్ చేసింది. దూరం నుండి, అతను కరీనాతో కాఫీ డేట్ను ఎంజాయ్ చేస్తున్నాడు. పోస్ట్లో, కరీనా కపూర్ ఇలా వ్రాశారు - సరే కాబట్టి మనం ఇప్పటికీ కరోనా యుగంలో ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నాము. అది అసలు మర్చిపోవద్దు. అంటూ పేర్కొంది.
ఆమె షేర్ చేసిన ఫొటోలో టెర్రస్పై సైఫ్ అలీ ఖాన్ వెనుక, అతని గార్డ్ ముసుగుతో నిలబడి ఉన్నాడు. కరీనా కపూర్ ఖాన్ ఈ ఫోటోను షేర్ చేసిన వెంటనే, అది వైరల్ కావడం ప్రారంభించింది. కరీనా కపూర్ ఖాన్కు కరోనా వచ్చినప్పుడు, సైఫ్ అలీఖాన్ గత వారం పాటు ముంబైలో లేరు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సైఫ్కి దూరంగా ఉంటూ నటిని చూసుకోవడం చూసి అభిమానులు సంతోషించక తప్పదు.

కరోనా బారిన
కరీనా కపూర్తో పాటు ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా కరోనా సోకింది. ఇద్దరు స్నేహితులు ఇటీవల కరణ్ జోహార్ ఇంట్లో మరియు రియా కపూర్ ఇంట్లో గెట్ టుగెదర్ హాజరయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. కరీనా, అమృత కోలుకుంటున్నారు. ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు తక్కువగానే కనిపించాయి.
కరీనా హోమ్ ఐసోలేషన్లో ఉంది. కరీనా త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ పార్టీకి హాజరైన వారిలో కనీసం 12 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఒకరు దగ్గుతూ కన్పించారని, వారి నుంచే మిగతా వారికి వైరస్ సోకి ఉంటుందని కరీనా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











