Don't Miss!
- News YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆ స్వర్గంలోకి తీసుకెళ్లు.. కరోనా వేళ కరీనా షాకింగ్.. హాట్ ఫోటో వైరల్
కరోనావైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్లో ఇంటి సభ్యులంతా ఓ చోటు ఉంటూనే తమ మధుర స్మతులను మరోసారి గుర్తు చేసుకొంటున్నారు. గతంలో వెళ్లిన ప్రదేశాలను, తమ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను సోషల్ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనాకపూర్ ఖాన్ షేర్ చేసిన ఓ ఫొటో మీడియాలో వైరల్గా మారింది. హాట్హాట్గా ఉన్న ఫోటో ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. అయితే ఈ ఫోటో లాక్డౌన్ బ్రేక్ చేసి ఫారిన్ వెళ్లారని అనుకొంటే పొరపాటే.. ఆ ఫోటో మీ కోసం..
విదేశీ విహారం చేస్తూ..
బాలీవుడ్లో కరీనాకపూర్, సైఫ్ ఖాన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరు సమయం చిక్కితే ఎక్కువగా తన కుమారుడు తైమూర్తో వెచ్చించడానికి ప్రయత్నిస్తారు. ముగ్గురు కలిసి విదేశీ యాత్రలకు వెళ్తుంటారు. అక్కడే క్వాలిటీ సమయాన్ని ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ వర్క్ ప్రెజర్ నుంచి రిలీజ్ అవుతుంటారు.
ఇన్స్టాగ్రామ్లో హాట్ హాట్గా
అదే క్రమంలో గతంలో విదేశీ విహారానికి వెళ్లిన సైఫ్ దంపతులు తన కుమారుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోను కరీనా కపూర్ షేర్ చేశారు. రెడ్ బికినీతలో బేబో కొబ్బరి నీళ్లు తాగుతూ ఫోటోకు ఫోజిచ్చింది. పక్కనే తైమూర్ పెయింటింగ్ వేస్తూండగా సైఫ్ ఆసక్తిగా చూస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్లో క్రేజీగా మారింది. ఫ్యాన్స్ ఈ ఫోటోపై తలోరకంగా కామెంట్ చేస్తున్నారు.
Recommended Video
|
నాకు కలలు లేవు.. మీకున్నాయా?
అలాంటి రొమాంటిక్ ఫోటోను చూస్తే కరీనా కపూర్ అలాంటి క్వాలిటీ టైమ్ మిస్ అవుతుందా అనే అనుమానం కలుగమానదు. అయితే అలాంటి ఆలోచనలు నాకు లేవు. బీచుల్లో గడపాలనే కోరికలు, కలలు లేవు. నీకేమైనా ఉండొచ్చేమో.. నన్ను ఆ స్వర్గంలోకి తీసుకెళ్లగలవా అంటూ ఫోటోతోపాటు ఓ కామెంట్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
కరీనాకపూర్ కెరీర్లో
ఇక కరీనాకపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఇర్ఫాన్ ఖాన్, రాధిక మదన్తో కలిసి అంగ్రేజీ మీడియం సినిమాలో నటించింది. ఈ చిత్రం కరోనావైరస్ కారణంగా అర్ధాంతరంగా థియేటర్ల నుంచి ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం హాట్స్టార్లో ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అమీర్ ఖాన్తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.