Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్.. మహానటి డిమాండ్ మామూలుగా లేదు!
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా లేదని చాలా క్లియర్ గా అర్దమవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా సెట్స్ పై ఉంటే మరో సినిమా గురించి పెద్దగా ఆలోచించరు. కానీ మెగాస్టార్ మాత్రం వరుసగా నాలుగైదు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నేటితరం హీరోయిన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ తో అవకాశం వచ్చినప్పటికీ
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే నేటితరం హీరోయిన్స్ ఎంతగా సంబరపడిపోతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ గురించి కూడా పెద్దగా ఆలోచించరు. ఎలాంటి పాత్ర చేయడానికైనా కూడా చాలా ఈజీగా ఒప్పేసుకుంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒక ఆఫర్ వచ్చినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కొంత సందేహించక తప్పలేదట.
సెటిల్మెంట్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ నెక్స్ట్ వేదాళం రీమేక్ తో బిజీ కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఎంతో కీలకమైన చెల్లలి పాత్ర కోసం గత కొంతకాలంగా చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ దీర్ఘంగా ఆలోచిస్తుండగా మెగాస్టార్ సింగిల్ సిట్టింగ్ లో సెటిల్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. నేటితరం మహానటి కీర్తి సురేష్ అయితేనే కరెక్ట్ గా సెట్టవుతుందని చాలా క్లారిటీగా చెప్పడంతో దర్శకుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సాయి పల్లవిని అనుకున్నారు..కానీ?
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కీర్తి కంటే ముందు సాయి పల్లవిని అనుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఎందుకో దర్శకుడు ఆమెను ఫైనల్ చేయడానికి ధైర్యం చేయలేదు. ఇక ఫైనల్ గా ఒకరిద్దరి హీరోయిన్స్ ని కూడా ఆడిషన్స్ కి పిలువగా వర్కౌట్ కాలేదు. ఆఖరికి మెగాస్టార్ నిర్ణయాన్ని ఫైనల్ చేయాల్సి వచ్చింది.
కీర్తి సురేష్.. భారీ డిమాండ్
ఇక మెగాస్టార్ చెల్లెలి పాత్ర కోసం కూడా కీర్తి సురేష్ భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందట. సాధారణంగా ఒక సినిమాకు కోటికి పైగా డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ వేదాళం రీమేక్ కి కోటి వరకు అడిగిందట. డీల్ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక మరోవైపు మహానటి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె రెమ్యునరేషన్ డోస్ మరింత పెంచవచ్చని సమాచారం.