Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహానటి రేంజ్లో హిట్టుకొట్టాలని అనుకుంది.. చివరికి ఇలా..
మహానటి సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమా ఆమెకు జీవితాంతం సరిపోయేంత కీర్తిని అందించింది. ఆ సినిమా ప్రభావం కారణంగా కీర్తి సురేష్ తన తదుపరి సినిమాలతో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని అందుకుంది. అందుకే కొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా నచ్చక వదులుకుంది.
మహానటి తరువాత ఇంతవరకు కీర్తి సురేష్ తెలుగు తెరపై హీరోయిన్ గా కనిపించలేదు. ఆ మధ్య మన్మథుడు 2లో కేవలం ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే మెరిసింది. అయితే మహానటి సినిమా తరువాత అమ్మడు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న చిత్రం పెంగ్విన్. ఈ సినిమాలో ఎమోషనల్ కాంటెంట్ తో పాటు సరికొత్త థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని సినిమా తప్పకుండా తన గత సినిమాల కంటే మంచి విజయాన్ని అందుకుంటుందని కీర్తి గత ఇంటర్వ్యూలలో తెలిపింది.
అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడం లేదు. మంచి డీల్ సెట్టవ్వడంతో నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 19న సినిమా వెబ్ ఫ్లాట్ ఫార్మ్ లో సందడి చేయనుంది. పెంగ్విన్ సినిమా తమిళ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ చేసి సక్సెస్ కొట్టాలని అనుకున్న కీర్తి సురేష్ ఆశలు చివరికి ఇలా.. లాక్ డౌన్ వల్ల అవిరైపోయాయి. మరి అమెజాన్ ప్రైమ్ లో సినిమాకు ఎలాంటి టాక్ అందుతుందో చూడాలి.