Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీ ప్రశ్నలకు నా సమాధానం.. కీర్తి సురేష్ రెడీ అవుతోంది!!
కీర్తి సురేష్ ఈ లాక్ డౌన్లో ఎంత సందడి చేసిందో అందరికీ తెలిసిందే. పెంగ్విన్ చిత్రంతో ఓటీటీలో బోణి కొట్టింది. కానీ ఈ చిత్రం అంతగా వర్కవుట్ కాలేదు. సినిమా యావరేజ్ అయినా కీర్తి సురేష్ నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. అసలే కీర్తి సురేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా మిస్ ఇండియా అంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.
ఆ మధ్య రిలీజ్ చేసిన మిస్ ఇండియా ట్రైలర్ బాగానే క్లిక్ అయింది. జగపతి బాబు కీర్తి సురేష్కు వార్నింగ్ ఇవ్వడం.. బిజినెస్ అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆటలు కాదు.. అదొక యుద్దం అంటూ కీర్తి సురేష్ను హెచ్చరించడం.. బిజినెస్ చేయడానికి పుట్టాను అంటూ దాని కోసం ఏదైనా చేస్తాను అంటూ కీర్తి సురేష్ కౌంటర్ ఇవ్వడం ఇలా ప్రతీ ఒక్క సీన్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా రేపు (నవంబర్ 4) విడుదల కాబోతోంది.
కీర్తి సురేష్ రేపు సినిమా విడుదల కాబోతోందన్న సందర్భంగా అభిమానులతో మాట్లాడేందుకు లైవ్లోకి రాబోతోన్నట్టు ప్రకటించింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు అందుబాటులో ఉంటాను.. మీరు ప్రశ్నలు వేయండి.. నేను సమాధానం ఇస్తాను అని ఫ్యాన్స్కు ఆఫర్ ఇచ్చింది. మరి అభిమానులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో.. కీర్తి ఎలాంటి సమాధానాలు ఇస్తుందో చూడాలి. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది.