Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కీర్తీ సురేష్కు ముహుర్తం పెట్టేశారట.. రెండోసారి కూడా!
మహానటి మూవీ తర్వాత అందాల నటి కీర్తీ సురేష్ క్రేజ్ దక్షిణాదిలో భారీగా పెరిగింది. ప్రస్తుతం అందం, అభినయం కలిసి ఉన్న హీరోయిన్లలో టాప్ స్థానాన్ని కీర్తీ సురేష్ దక్కించుకొన్నది. మహానటి తర్వాత మళ్లీ ఓ మహిళ ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని యువ నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించనున్నారు. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తారు. గతంలో మహానటి చిత్రానికి డానీ సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సంగతి తెలిసిందే.
సమకాలీన పరిస్థితులకు సంబంధించిన ఫ్యామిలీ డ్రామా. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇది అని చిత్ర యూనిట్ పేర్కొన్నది. కీర్తి సురేష్కు దక్షిణాదిలో ఉన్న మార్కెట్ను దృష్టిలోపెట్టుకొని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం అని పేర్కొన్నారు.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్నది. అనంతరం ఈ సినిమాను కేరళ షిప్ట్ చేసి ఏకధాటిగా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన సర్కార్, పందెంకోడి2 చిత్రాలు భారీ సక్సెస్ను సాధించిన సంగతి తెలిసిందే.