Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి కీర్తి సురేష్ రిస్క్ చేస్తోందా.. కోట్లు ఖర్చు చేసి..?
సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా నటీనటులకు వచ్చిన ఆదాయాన్ని ఎలాగైనా రెట్టింపు చేసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. రంగుల ప్రపంచంలో వచ్చిన ఆదాయానికి బ్యాకప్ లేకపోతే భవిష్యత్తు కొంచెం కష్టంగానే ఉంటుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చాలా వరకు స్టార్స్ బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. ఇక కొందరు నిర్మాతలుగా మారుతారు. అదే తరహాలో కీర్తి సురేష్ కూడా ప్రొడక్షన్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ ప్రొడక్షన్ హౌజ్
హీరోలు జీవితంలో ఒక్కసారైనా నిర్మాతగా మారకుండా ఉండలేరు. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఉహీంచని విధంగా దెబ్బతిన్నారు. హీరోయిన్స్ కూడా అలాంటి ప్రయోగాలు గట్టిగానే చేశారు. ప్రస్తుతం ఛార్మి కౌర్ పూరి జగన్నాథ్ తో కలిసి ప్రొడక్షన్ టీమ్ లో వర్క్ చేస్తోన్న విషయం తెలిసిందే.
నిర్మాతగా కీర్తి సురేష్
ఛార్మి ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బును మొత్తం పూరి సినిమాలలో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అందుకుంటోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమెకు మంచి లాభాలను అందించింది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఒక వైవు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా బిజీ అవ్వాలని అనుకుంటోందట.
రెమ్యునరేషన్ డోస్ పెరగడంతో..
మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక రెమ్యునరేషన్ డోస్ కూడా పెరిగింది. ఆమె ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు 2కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇక స్టార్ హీరోల సినిమాలకు కోటికి పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. దానికి తోడు పలు రకాల యాడ్స్ తో కూడా ఈ బ్యూటీ తన ఆదాయాన్ని పెంచుకుంటోంది.
Recommended Video
ముందుగా ఒక వెబ్ సిరీస్
ఇక కీర్తి సురేష్ త్వరలోనే నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ముందుగా ఈ బ్యూటీ ఒక వెబ్ సిరీస్ తో తన ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయనుందట. ఆ తరువాత కోట్లు ఖర్చు చేసి రెండు సినిమాలను నిర్మించాలని అనుకుంటోందట. టాలెంట్ ఉన్న యువ దర్శకులను గుర్తించి ఆమె ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. మరి ఆమె నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.