Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
చిరుకు హీరోయిన్గా క్రేజీ బ్యూటీ.. మహానటిని ఎంచుకున్న కొరటాల!
రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు చాలా గ్యాప్ తీసుకుని సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొరటాల శివ చిరంజీవికి జోడి కోసం పలువురి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు.
అనుష్క, నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ల పేర్లని కొరటాల శివ ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. కథలో భాగంగా చిరంజీవి సరసన కీర్తి సురేష్ అయితే బావుంటుందని కొరటాల భావిస్తున్నారట. కీర్తి సురేష్ గత ఏడాది మహానటి చిత్రంలో అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే.
మహానటి తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని కీర్తి సురేష్ ఎంచుకుంటోంది. జూన్ నుంచి కొరటాల, చిరంజీవి చిత్రం పట్టాలెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ చిరంజీవి కోసం ఓ సందేశాత్మక కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.