Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కియారా బుగ్గలపై గాట్లు.. రూమర్లతో హోరెత్తిన మీడియా.. అసలేం జరిగిందంటే!
ఎంఎస్ ధోని బయోపిక్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కియారా అద్వానీ అటు గ్లామర్ పరంగాను, నటనపరంగాను అందర్ని ఆకట్టుకొంది. ఆ తర్వాత టాలీవుడ్లో ఏకంగా సూపర్స్టార్ మహేష్ బాబు పక్కన భరత్ అనే నేను సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. అంతేకాకుండా రాంచరణ్తో వినయ విధేయ రామలో కూడా ఆఫర్ను దక్కించుకొన్నది. తాజాగా బాలీవుడ్లో రెండు భారీ సినిమా ఆఫర్లను చేజిక్కించుకొన్నది. ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్లున్న కియారాపై రూమర్లు రాగా.. ఆమె క్లారిటీ ఇచ్చింది. అవేమిటంటే..
కియారా అద్వానీపై రూమర్లు
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కియారా అద్వానీ ముఖంపై రెండు మచ్చలు కనిపించడం, ముఖం వాచిపోయి ఉండటంతో రకరకాల ఊహాగానాలకు చోటిచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ వికటించిందని కొందరు రూమర్లను వార్తలుగా మలిచారు. తనపై వస్తున్న రూమర్లకు ఆమె సమాధానం ఇచ్చింది.
ప్లాస్టిక్ సర్జరీ వికటించిందా? అనే
ముంబై మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ఓ వస్త్ర సముదాయం ప్రారంభోత్సవానికి వెళ్లడానికి సమయం లేకపోవడంతో నేను మేకప్ చేసుకొన్నాను. దాంతో కాస్త తేడాగా కనిపించింది. నా బుగ్గలపై గాట్లు పడినట్టు కనిపించాయి అని కియారా వెల్లడించింది.
నాకే అనుమానం వచ్చిందని
నా ముఖంలోని ఎముక ఉబ్బెత్తుగా ఉండటం వల్ల చూసే వారికి అనుమానం కలిగించేలా చేసింది. ఆ రకంగా నా ముఖంపై మచ్చల గురించి రకరకాలుగా మాట్లాడుకొన్నారు. నా ముఖంపై ఉన్న మచ్చలను చూసి నాకే అనుమానం వచ్చేలా కామెంట్ చేశారు అని కియారా అన్నారు.
కబీర్ సింగ్లో షాహీద్ కపూర్తో
కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్లో నటించింది. ఏప్రిల్ 13న రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం జూన్ 21న రిలీజ్కు సిద్ధమవుతున్నది.
అక్షయ్ కుమార్తో రెండు సినిమాలు
కబీర్ సింగ్ మూవీ తర్వాత కరణ్ జోహర్ సినిమా గుడ్ న్యూస్లో హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఇంకా అక్షయ్ కుమార్తోనే కాంచన సినిమా రీమేక్లో ఆఫర్ దక్కించుకొన్నది. ఈ చిత్రానికి లారెన్స్ రాఘవ దర్శకుడు.