మళ్లీ తెగించేసిన గేమ్ చేంజర్ హీరోయిన్.. పెళ్లి తర్వాత ఊహించని రీతిలో గ్లామర్ షో
తెలుగులోకి అనేక సినీ ఇండస్ట్రీ అమ్మాయిలు అడుగు పెట్టి సత్తా చాటుతుంటారు. కొంతమంది గ్లామర్ కే పరిమితం అయి ఐటమ్ సాంగ్స్ తో సరిపెట్టుకుంటే మరికొందరు మాత్రం హీరోయిన్ గా వరుస సినీ అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగేందుకు ట్రై చేస్తున్న బాలీవుడ్ గ్లామరస్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈ చిన్నది సినిమాలతోపాటు అందాల ప్రదర్శనలో బ్లాక్ బస్టర్స్ కొడుతోంది. ఇక తాజాగా ఇచ్చిన పోజులు, ఫొటోల్లో ఊహించని రీతిలో అందాల ప్రదర్శన చేసింది.
అలియా అద్వానీ : 2014లో ఫగ్లీ అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుందరాంగీ కియారా అద్వానీ. ఆమె అసలు పేరు అలియా అద్వానీ. అయితే అప్పటికే హిదీలో అలియా భట్ కూడా ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకోమ్మని కండలవీరుడు సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చాడు. దీంతో అలియా కాస్తా కియారాగా పేరు మార్చుకుంది. అలా హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాతి కాలంలో మంచి పేరు తెచ్చుకుంది.

రాజకీయాల నేపథ్యం : బ్యూటిఫుల్ హిందీ భామ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషం తెలిసిందే. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా, అందం, అభినయంతో ఆకట్టుకుంది. రాజకీయాల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. దీంతో కియారా పేరు కూడా తెలుగులో పాపులర్ అయింది.

టాప్ యాంగిల్ పోజు : భరత్ అను నేను తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కియారా అద్వానీ జత కట్టిన చిత్రం వినయ విధేయ రామ. ఇందులో కాస్తా గ్లామర్ ఒలకబోస్తూ అందాలు ఆరబోసింది ఈ బ్యూటి. టాప్ యాంగిల్స్ పోజుల్లో అందాల ప్రదర్శన చేసింది. అయితే బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. దీంతో ఆమెకు తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి.

డిజాస్టర్ కావడంతో : తెలుగులో రెండో సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ బాలీవుడ్ కే మకాం మార్చింది కియారా అద్వానీ. తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటి. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న కియారా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఆమె నటించిన అన్నీ చిత్రాలు సక్సెస్ కావడంతో అక్కడ లక్కీ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది.

ఓటీటీతోపాటు : ఇటీవల ఓటీటీతోపాటు జూన్ 29న సత్య ప్రేమ్ కి కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కియారా. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలో మరోసారి జోడీ కట్టనుంది కియారా అద్వానీ.
పెళ్లి తర్వాత చేయకపోవడంతో : సినిమాలు, పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కియారా అద్వానీ సోషల్ మీడియాలోనూ చాలా ఘాటుగా అందాలను ఎక్స్ పోజ్ చేస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో పరువాల విందును ఎంతో ఓపెన్ గా చూపించేసింది. చేతులు పైకెత్తి పోజులిస్తూ ఊహించని రీతిలో గ్లామర్ షో చేసింది. కియారా తన పెళ్లి తర్వాత ఇలాంటి ఫొటోషూట్ చేయకపోడవంతో ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











