నన్ను నమ్మండి.. అలా చేస్తే బాగుంటుందంటూ హీరోయిన్ కామెంట్స్
అందానికి, అమాయకత్వానికి అడ్రస్లా ఉండే లావణ్య త్రిపాఠి.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే గతకొంత కాలం నుంచి తెరపై కనిపించని లావణ్య త్రిపాఠి.. నిఖిల్ చిత్రం అర్జున్ సురవరంతో త్వరలోనే పలకరించనుంది. తాజాగా లావణ్య చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
మొదట్లో వరుస విజయాలతో ఊపు మీదున్న లావణ్యకు రాను రాను గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో ఫుల్ ఫామ్లోకి వచ్చిన లావణ్య మంచి హిట్ కొట్టలేకపోతోంది.హిట్టు చూసి చాలా కాలమైన లావణ్యకు ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, యుద్దం శరణం లాంటి సినిమాలు బోల్తా కొట్టడంతో ఎదురుదెబ్బ తగిలింది.
View this post on InstagramA post shared by Lavanya T (@itsmelavanya) on

సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే లావణ్య.. తాజాగా ఓ పోస్ట్ చేసింది. 'ఓ పని మీద కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లామే అనుకోండి.. మార్గమధ్యలో నౌటియాల్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద ఆ ట్రిప్ ముగిస్తే ఎంతో బాగుంటుంది. నన్ను నమ్మండి. నాకు నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి' అంటూ డెహ్రాడూన్లో చాయ్ తాగుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. లావణ్య నటించిన అర్జున్ సురవరం నవంబర్ 29న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











