Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహానటి మరో మైలురాయి.. 100 రోజులు పూర్తి చేసుకున్న చిరస్మరణీయ చిత్రం!
మహానటి చిత్రం మరో మైలురాయిని అధికమించింది. లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. యువ దర్శకుడు నాగ అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రని అందంగా తెరకెక్కించాడు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించింది.
మహానటి చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలో చాలా మంది స్టార్స్ భాగమయ్యారు. సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటించారు. శివాజీ గణేశన్ పాత్రలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించాడు.
రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాగ చైతన్య ఇలా చాలా మంది ప్రముఖ నటులు ఏ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ చాలా కళాత్మకంగా సావిత్రి చిన్ననాటి నుంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ ఆయ్యాక ఆమె వ్యక్తిగత జీవితం, కెరీర్ విషయంలో ఎదురైన ఒడుదుడుకులని ఎమోషల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించాడు. మే 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి ఘనవిజయం సాధించింది.