Don't Miss!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
సర్కారు వారి పాట హీరోయిన్ ఫిక్స్.. బర్త్ డే విషెస్ తో క్లారిటీ ఇచ్చిన మహేష్
మహానటి సినిమాతో ఒక్కసారిగా సౌత్ లో అగ్ర నటీమణులు స్థానాల్లో నిలిచిన బ్యూటీ కీర్తి సురేష్. ఆమె సెలెక్ట్ చేసుకున్న ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తధనం ఉంటుందనే చెప్పాలి. వరుస బాక్సాఫీస్ హిట్స్ రావడంతో ఈ బ్యూటీ చాలా ఆలోచించి అడుగులు వేస్తోంది. ఇక నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు కావడంతో అమ్మడికి అభిమానులతో పాటు స్టార్ సెలబ్రెటీలు కూడా బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన బెస్ట్ విషెస్ అందించారు.
Recommended Video
రూమర్స్ కి ఎండ్ కార్డ్ పెట్టిన మహేష్
సర్కారు వారి పాట హీరోయిన్ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఫైనల్ గా మహేష్ బాబు ఆ రూమర్స్ కి ఎండ్ కార్డ్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేడు కీర్తి సురేష్ కు మహేష్ తన బెస్ట్ విషెస్ అందించారు. సూపర్ టాలెంటెడ్ గర్ల్ కీర్తి సురేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు సర్కారు వారి పాట టీమ్ మిమ్మల్ని ఆహ్వానిస్తోందని అన్నారు.
కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్..
అంతే కాకుండా తప్పకుండా మీ జీవితంలో ఈ సినిమా ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుందని చాలా గొప్ప సినిమా అవుతుందని కూడా మహేష్ వివరణ ఇచ్చారు. మొత్తానికి సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. మొన్నటివరకు ఈ బ్యూటీని ప్రాజెక్టు నుంచి తప్పించారని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్దాలని తేలిపోయింది.
మహానటి కోరిక నెరవేరింది..
కీర్తి సురేష్ చాలా ఇంటర్వ్యూలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో నటించాలని ఉందని చెప్పింది. అయితే పవన్ తో అజ్ఞాతవాసి సినిమా చేసిన ఈ బ్యూటీ అనుకున్నంత క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా ద్వారా మహేష్ తో స్క్రీన్ చేసుకోవడానికి సిద్ధమైంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి.
సినిమా విడుదల ఎప్పుడంటే..
సర్కారు వారి పాట అసలైతే సమ్మర్ లోనే సెట్స్ పైకి రావాల్సింది. ఈ సినిమా కోసం పరశురామ్ నాగ చైతన్యతో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టాడు. ఇక సినిమాలో మహేష్ సరికొత్త లుక్ తో ఆడియెన్స్ కి సరికొత్త కిక్కివ్వబోతున్నాడు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని అమెరికాలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు వచ్చే సమ్మర్ వరకు సినిమాను పూర్తి చేసి 2021 లోనే సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.