Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలి రేంజిలో మణిరత్నం పీరియడ్ మూవీ: ప్రధాన పాత్రలో ఐశ్వర్యరాయ్?
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ పీరియడ్ డ్రామా 'బాహుబలి' ప్రాజెక్ట్. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఓ సంచలనం. దాన్ని కొట్టే చిత్రం ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.
అయితే త్వరలో బాహుబలి రేంజిలో ఓ పీరియడ్ డ్రామా ప్లాన్ చేస్తున్నారట ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఇందులో అమితాబ్ బచ్చన్తో కూడా ఓ కీలకమైన పాత్ర చేయించేందుకు ప్రత్నిస్తున్నారని, పాపులర్ సౌత్ స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్గా ఐశ్వర్యరాయ్
హిస్టారికల్ డ్రామాగా రూపొందబోయే ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ కోసం ఐశ్వర్యరాయ్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. మణిరత్నం చెప్పిన కథ, అందులో తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
వారికోసం ప్రయత్నాలు అందుకేనా?
తెలుగు, తమిళంలో రూపొందే ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేసే ఆలోచన ఉండటంతో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లాంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నారటన ఈ గ్రేట్ డైరెక్టర్.
ఆ నవల ఆధారంగా..
ఈ మూవీ కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా రూపొందబోతోందని, మూడు భాగాలుగా ఈ ప్రాజెక్టును మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుస్తకం మొత్తం 5 భాగాలుగా ఉన్నప్పటికీ సినిమాను మూడు భాగాల్లో ఫినిష్ చేస్తారట.
బల్క్ డేట్స్
మూడు భాగాలు, భారీ బడ్జెట్ కావడంతో పలువురు స్టార్లను బల్క్ డేట్స్ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ఇందులో నటించడానికి ఐశ్వర్యరాయ్ ఓకే చెప్పిందని, అమితాబ్ బచ్చన్ను ఓ కీలకమైన పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అయితే ఆయన ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
సంక్రాంతికి ప్రకటన?
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మణిరత్నం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పుడే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.