రెడ్ బికినీ లో మానుషి చిల్లర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తుందే
మనుషీ చిల్లర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2017లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. హర్యానా కు చెందిన 67వ ప్రపంచ సుందరి మిస్వరల్డ్-2017 కిరీటం అవార్డును గెలుచుకున్న భామ. భారతదేశం తరపున ఈ కిరీటం గెలిచిన ఆరవ యువతిగా మానుషీ రికార్డు సృష్టించింది.
కిరీటం గెలిచిన తరువాత అమ్మడు పలు కాస్మొటిక్ కంపెనీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఆ తర్వాత 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా మానుషీ కి మాత్రం అవకాశాలను బాగానే అందించింది. అలా ఈ చిన్నది సౌత్ లో కూడా ఆఫర్స్ ను అందుకుంది.

రీసెంట్ గా మానుషీ చిల్లర్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినా మానుషీ అందానికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.
మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో బడేమియా చోటే మియా అనే చిత్రంలో నటించింది . అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ చిత్రం ఇది. ఈ మూవీ కూడా నిరాశపరిచింది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం మానుషీ గ్లామర్ ట్రీట్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలే అమ్మడు మిస్ వరల్డ్ బ్యూటీ. ఏ డ్రెస్ వేసినా, అందాల ఆరబోత మాత్రం తప్పనిసరి. ముఖ్యంగా బికినీ ట్రీట్ అయితే కుర్రాళ్లకు పండగే. తాజాగా ఈ భామ బికినీ ట్రీట్ ఇచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది. రెడ్ బికినీలో అమ్మడు హాట్ ఫోజులు కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్నాయి.
సన్నని నడుము, ఎద అందాలను ఆరబోసి నవ్వులు చిందిస్తూ కనిపించింది. వెకేషన్ మోడ్ లో ఉన్న ఈ బ్యూటీ ఈరోజు ఏదో ఒక స్పెషల్ న్యూస్ చెప్తానని చెప్పుకొచ్చింది. కొంపతీసి పెళ్లి వార్త అయితే కాదు కదా అని అభిమానులు ఇంకోపక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేదు .. కొత్త సినిమా అప్డేట్ అయ్యి ఉంటుందిలే అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఆ స్పెషల్ న్యూస్ ఏంటి అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











