Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దిల్ రాజు సినిమాలో మేఘా ఆకాష్కు ఛాన్స్.. హీరో ఎవరంటే!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఏడాది పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఎఫ్2 చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ తో మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదే విధంగా దిల్ రాజు చిన్న చిత్రాలని నిర్మించి విజయాలు అందుకోవడంలో దిట్ట. యువ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడిగా మేఘా ఆకాష్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేఘా ఆకాష్ నితిన్ సరసన లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో మేఘా ఆకాష్ కు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. తాజాగా దిల్ రాజ్ నిర్మించే చిత్రంలో మేఘా ఆకాష్ కు ఛాన్స్ దక్కింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే మేఘా ఆకాష్ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఈ చిత్రం మరో అవకాశం అని చెప్పొచ్చు.
ఆడు మగాడ్రా బుజ్జి ఫేమ్ కృష్ణారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నీదీ నాదీ ఒకటే లోకం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ కి కూడా ఈ చిత్ర విజయం చాలా అవసరం.