Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బెల్లంకొండ నెక్ట్స్ మూవీలో జాయినైన మెహ్రీన్
వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమా షూటింగులో బిజీ అయిపోయాడు. 'సాక్ష్యం' తర్వాత ఆయన నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో ఇప్పటికే కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్గా మెహ్రీన్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షూటింగులో మెహ్రీన్ జాయినైంది.
ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నారట. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాత: నవీన్ సొంటినేని, సహనిర్మాత: చాగంటి సంతయ్య, సంగీతం: ఎస్ఎస్ థమన్, సాహిత్యం: చంద్రబోస్, మాటలు: అబ్బూరి రవి, సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు, ఎడిటర్: ఛోటా కే ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: చిన్నా, దర్శకత్వం : శ్రీనివాస్