Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బెల్లంకొండ నెక్ట్స్ మూవీలో జాయినైన మెహ్రీన్
వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమా షూటింగులో బిజీ అయిపోయాడు. 'సాక్ష్యం' తర్వాత ఆయన నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో ఇప్పటికే కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్గా మెహ్రీన్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షూటింగులో మెహ్రీన్ జాయినైంది.
ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నారట. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాత: నవీన్ సొంటినేని, సహనిర్మాత: చాగంటి సంతయ్య, సంగీతం: ఎస్ఎస్ థమన్, సాహిత్యం: చంద్రబోస్, మాటలు: అబ్బూరి రవి, సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు, ఎడిటర్: ఛోటా కే ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: చిన్నా, దర్శకత్వం : శ్రీనివాస్