Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
హైదరాబాద్లో ల్యాండైన నయనతార.. అన్నాత్తే కోసం లేడీ 'బిల్లా'లా హొయలు!
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో చివరిగా సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ తమిళంలో మాత్రం బిగిల్, దర్బార్, మూకుత్తి అమ్మాన్ లాంటి సినిమాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతానికి ఆమె ఇప్పుడు మూడు తమిళ సినిమాల్లో నటిస్తోంది అందులో ఒకటి రజనీకాంత్ సరసన అన్నాత్తే సినిమా. సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తేకి శివ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ విధించింది.
మొదటిసారి ఘాటుగా దర్శనమిచ్చిన శివాత్మిక రాజశేఖర్
అయితే 'అన్నాత్తే' సినిమా వారం పాటు నైట్ షెడ్యూల్లో షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో చిత్రబృందం రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసుల నుంచి రాత్రి పూట షూటింగ్ జరుపుకోవడానికి ప్రత్యేకంగా అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం నయనతార తాజాగా హైదరాబాద్ చేరుకుంది. తన చార్టెడ్ ఫ్లైట్ లో ఆమె హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడింది. కరోనా పరిస్థితుల కారణంగా కొన్నాళ్లు రజనీకాంత్ ఆరోగ్యం బాగోక కొన్నాళ్ళు వాయిదా పడుతూ వచ్చింది.
అయితే రజనీకాంత్ కోలుకున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించాలని యూనిట్ భావిస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో ఆమె లేడీ బిల్లాను తలపిస్తోందని అభిమానులు సంబర పడుతున్నారు. ఇక కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న అన్నాత్తేలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.