Don't Miss!
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- News కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
గోవిందా.. గోవిందా: శ్రీవారి దీవెనకోసం ఏడు కొండలెక్కిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మంగళవారం ఉదయం తిరుపమల శ్రీవారిని దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణ చేస్తూ కాలినడకన ఏడుకొండలెక్కి దర్శనం చేసుకున్నారు. తన తాజా చిత్రం 'ఓ బేబీ' జులై 5న విడుదలవుతున్న నేపథ్యంలో వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం కోసం చిత్ర బృందంతో కలిసి ఆమె తిరుమల వచ్చారు.
సమంత నటించిన గత చిత్రం 'మజిలీ' విడుదల సమయంలో కూడా ఆమె ఇదే తరహాలో కాలి నడకన కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయం సాధించడంతో సమంత తిరుమలతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు.
సమంత ప్రధాన పాత్రలో నందీని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించారు.
సమంతతో పాటు లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, తేజ, ప్రగతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 5న ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో సమంత మాట్లాడుతూ... ఈ కథను మేము సెలక్ట్ చేసుకున్నాం అనడం కంటే ఆ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకున్నట్లు ఉంది. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సంతోషం ఇచ్చింది. ఛాలెంజ్గా చేసేలా చేసిందని తెలిపారు.