twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవిందా.. గోవిందా: శ్రీవారి దీవెనకోసం ఏడు కొండలెక్కిన సమంత

    |

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మంగళవారం ఉదయం తిరుపమల శ్రీవారిని దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణ చేస్తూ కాలినడకన ఏడుకొండలెక్కి దర్శనం చేసుకున్నారు. తన తాజా చిత్రం 'ఓ బేబీ' జులై 5న విడుదలవుతున్న నేపథ్యంలో వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం కోసం చిత్ర బృందంతో కలిసి ఆమె తిరుమల వచ్చారు.

    సమంత నటించిన గత చిత్రం 'మజిలీ' విడుదల సమయంలో కూడా ఆమె ఇదే తరహాలో కాలి నడకన కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయం సాధించడంతో సమంత తిరుమలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.

     Oh! Baby release: Samantha Akkineni visit to Tirumala

    స‌మంత ప్రధాన పాత్రలో నందీని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మించారు.

     Oh! Baby release: Samantha Akkineni visit to Tirumala

    సమంతతో పాటు ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్, తేజ, ప్రగతి ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 5న ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో సమంత మాట్లాడుతూ... ఈ కథను మేము సెలక్ట్ చేసుకున్నాం అనడం కంటే ఆ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకున్నట్లు ఉంది. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సంతోషం ఇచ్చింది. ఛాలెంజ్‌గా చేసేలా చేసిందని తెలిపారు.

    English summary
    Samantha Akkineni paid her visit to Tirumala today. She has been visiting the temple before the release of her films and this turned out to be a sentiment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X