Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అడ్వాన్స్ వద్దు, షూటింగే ముందు... అదిరిన దీపిక స్ట్రాటజీ
దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేతతో షూటింగ్ లకు అనుమతి లభిస్తుండటంతో, ప్రస్తుతం సినీ జనం చిత్రీకరణలకు చకచకా పావులు కదిపేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, సెట్స్ మీదకు సినిమాలను పరుగులు పెట్టించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇక ఇటీవలే తమ బ్యానర్ పై అతి పెద్ద సినిమాకు శ్రీకారం చుట్టిన వైజయంతీ మూవీస్, తమ నటీనటులకు అడ్వాన్సులు కూడా పంపించేసింది. కానీ, అందులో ఓ అడ్వాన్స్ తిరిగి వచ్చేయడంతో చిత్ర బృందం ఖంగుతిన్నదంట.
ప్రభాస్ 21వ చిత్రంగా ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో పాపులర్ అయిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అమ్మడు ఏకంగా 30 కోట్లు వసూలు చేస్తోందని సమాచారం. అయితే అమ్మడికి ముందుగానే అడ్వాన్స్ పంపించగా, ఆమె నిర్మొహమాటంగా ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి పంపించేసిందట. అదేంటి అని కంగారు పడిపోకండి. అమ్మడి ఉద్దేశం వేరుగా ఉంది మరి.
ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుంచి బయటపడుతున్నాం కాబట్టి, షూటింగ్ కోసం లిక్విడ్ క్యాష్ ను సర్దడం ఎంత ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమో అందరికీ తెలిసిందే. కాబట్టి, ఈ సమయంలో తనకు అడ్వాన్స్ ఇచ్చే బదులు, ఆ మొత్తాన్ని షూటింగ్ నిమిత్తం ఖర్చుచేయాల్సింది దీపిక నిర్మాతలకు సూచించిందట.
దీంతో మా హీరోయిన్ మనసు ఎంతమంచిదో అంటూ చిత్ర బృందం తెగ మురిసిపోతోంది. నిజమే మరి, అడ్వాన్సులు తీసుకుని మరీ, నిర్మాతలకు హ్యాండ్ ఇస్తున్న హీరోయిన్ల ఉన్న ఈ కాలంలో దీపిక లాంటి టాప్ హీరోయిన్ ఒక్క పైసా పుచ్చుకోకుండా షూటింగ్ మొదలుపెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఏమైనా ఇదే స్ఫూర్తితో ఈ సినిమా మరింత అందంగా ముస్తాబవుతుందని ఆశిద్దాం.