Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బాత్ టబ్లో పరిణితి చోప్రా.. ముఖంపై దారుణమైన గాయంతో.!
పరిణితి చోప్రా.. ప్రియాంక చోప్రా సోదరిగా సినీ రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో చాలా సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చి పెట్టాయి. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేట్ అయింది.
2012లో ఆమె నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయ ఫిలిం అవార్డు-స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి. ఆ తరువాత శుద్ధ్ దేశీ రోమాన్స్ (2013), హసీతో ఫసీ (2014)వంటి సినిమాల్లోని నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లోని నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది.
ప్రస్తుతం ఆమె హాలీవుడ్ సినిమా 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్' అనే సినిమా రీమేక్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తన పాత్ర ఫస్ట్లుక్ను తాజాగా ఆమె విడుదల చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో 'నా కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన పాత్రను చేస్తున్నాను. ఇలాంటిది గతంలో ఎప్పుడూ చేయలేదు. 'ద గర్ల్ ఆన్ ది ట్రైన్' ఫస్ట్ లుక్ ఇది' అని ఆమె పేర్కొంది.
ఈ ఫొటోలో పరిణితి ముఖంపై పెద్ద గాయంతో బాత్ టబ్లో కూర్చుని ఉంది. ఈ పిక్ చూసిన వారందరూ భయపడిపోయేలా కనిపిస్తోంది. దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కీర్తి కుల్హారీ కూడా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాను రిబు దాస్ గుప్తా తెరకెక్కిస్తున్నారు.